Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. తుక్కు బండికి బదులు బొలెరో వాహనం
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించడంలో తాను ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు......
ఇంటర్నెట్ డెస్క్: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించడంలో తాను ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఓ వ్యక్తి తయారు చేసిన తుక్కు వాహనాన్ని తీసుకొని.. అందుకు బదులుగా అతనికి ఎస్యూవీ బొలెరో వాహనాన్ని కానుకగా ఇచ్చారు.
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవ్రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్ అనే వ్యక్తి స్థానికంగా కంసాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమారుడికి కారు ఎక్కాలని చిన్నప్పటి నుంచి కోరిక. అయితే అంత స్తోమత లేని దత్తాత్రేయ.. తుక్కు వాహనాల విడి భాగాలు సేకరించి సొంతంగా వాహనం తయారుచేశారు. కిక్ ఇస్తే స్టార్ట్ అయ్యేలా దీన్ని రూపొందించారు. సాధారణంగా ఈ మెకానిజంను బైక్లలో చూస్తుంటాం. అంతేకాదు.. దత్తాత్రేయ తయారుచేసిన వాహనంలో స్టీరింగ్ ఎడమవైపున ఉండటం విశేషం.
కాగా ఈ వాహనం గురించి ఓ యూట్యూబ్ ఛానెల్ వీడియో రూపొందించగా.. అది ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వ్యాపార దిగ్గజం.. వారికి అప్పుడే ఈ ఆఫర్ ప్రకటించారు. ‘ఇది ఆటోమొబైల్ నిబంధనలను అందుకోవడం లేదని తెలుసు. కానీ, మన ప్రజల తెలివితేటలు, తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా స్థానిక అధికారులు ఈ వాహనాన్ని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటారు. దాన్ని నాకు ఇస్తే అందుకు బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తాను. ఆయన సృజనాత్మకతను మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతాం. అది మాలో స్ఫూర్తి నింపుతుంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
మహీంద్రా ఆఫర్కు అంగీకరించిన దత్తాత్రేయ తన వాహనాన్ని ఇస్తానని తర్వాత ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యాపార దిగ్గజం.. దత్తాత్రేయ కుటుంబానికి బొలెరో వాహనాన్ని అందించింది. ‘తన వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకునే ప్రతిపాదనను అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ఆ కుటుంబం బొలెరోను అందుకుంది. ఆయన సృష్టించిన దానికి గర్విస్తున్నాం. మమ్మల్ని ఉత్తేజపరిచేందుకు ఇది మా రీసెర్చ్ వ్యాలీలోని అన్ని రకాల కార్ల సేకరణలో భాగంగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. తన సంస్థ ప్రతినిధులు దత్తాత్రేయ కుటుంబానికి బొలెరోను అందిస్తున్న ఫొటోలను ఆ ట్వీట్కు జోడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?