Anand Mahindra: మా కారును పేల్చాలంటే న్యూక్లియర్‌ బాంబు కావాలి: ఆనంద్‌ మహీంద్రా

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.......

Published : 25 May 2022 01:55 IST

ముంబయి: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ, వారికి చేయూతనందిస్తుంటారు. నెటిజన్ల నుంచి ఆసక్తికరమైన, వింత ప్రశ్నలు ఎదురైనప్పుడు అంతే ఫన్నీగా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ నవ్వులు పంచుతోంది. స్కార్పియో-ఎన్‌ పేరుతో తమ సంస్థ మార్కెట్లోకి ఓ కొత్త వాహనాన్ని ప్రవేశపెడుతోందని ఆనంద్‌ మహీంద్రా తాజాగా వెల్లడించారు. ఆ సరికొత్త మోడల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు.

మహీంద్రా పోస్టును ట్యాగ్‌ చేస్తూ రోహిత్‌ బిష్ణోయ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఫన్నీగా స్పందించారు. ఈ వాహనాలతో బాలీవుడ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ షెట్టి ఓ యాక్షన్‌ సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తాడు అనేలా పోస్టు పెట్టాడు. దీనికి మహీంద్రా అంతే ఫన్నీగా స్పందిస్తూ.. ‘ఈ వాహనాన్ని పేల్చాలంటే రోహిత్‌ షెట్టికి అణుబాంబు అవసరం పడుతుంది’ అంటూ రీట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌గా మారి నెటిజన్లకు నవ్వులు పంచుతోంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ షెట్టి అంటేనే యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరు. లవ్‌ ట్రాక్‌ను ఎంత బాగా పండించగలరో, అదే స్థాయిలో హీరోలతో సాహసకృత్యాలు చేయించగలరు. రోహిత్‌ షెట్టి పలు సినిమాల్లో భారీ స్థాయిలో కార్లతో యాక్షన్‌ సీన్లు ఉంటాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని