Anand Mahindra: రూ.ఎన్ని కోట్లు పెట్టినా.. ఇంత ఉత్కంఠ తేలేరు..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు వర్తమాన అంశాలను సరికొత్తగా పంచుకుంటారు.

Published : 29 Sep 2022 22:27 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు వర్తమాన అంశాలను సరికొత్తగా పంచుకుంటారు. ఈసారి ఆయన ఫుట్‌బాల్ ఆట గురించి ప్రస్తావించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ తెలిసిందే. అందులోనూ ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్‌ జరుగుతుందంటే అభిమానుల్లో ఆ ఉత్కంఠ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖతార్ వేదికగా జరిగే వరల్డ్ కప్ టోర్నీ ప్రమోషన్ కోసం ఆ దేశం సహా ఫిపా ఎంతో ఖర్చుచేస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నారులకు సంబంధించి మహీంద్రా షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. 

‘వరల్డ్ కప్‌ టోర్నీ ప్రచారం కోసం ఫిఫా, ఖతార్‌ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే ఈ చవకైనా, ఉల్లాసకరమైన వీడియో కలిగించినంత ఉత్కంఠను ఆ ప్రచారంతో వస్తుందని నేను అనుకోవట్లేదు. ఈ ప్రపంచానికి ఫుట్‌బాల్ అంటే ఎంత క్రేజ్‌ ఉంటుందో ఆ పిల్లల వీడియో సరిగా వెల్లడిచేస్తోంది’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. అందులో చిన్నారులు ఫుట్‌బాల్ పట్ల చూపుతున్న ఉత్సాహం, మధ్యలో వారు వేస్తోన్న డ్యాన్సులు చూస్తుంటే ముచ్చటేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని