Anand Mahindra: నూతన సంవత్సరం వేళ.. ఆనంద్‌ మహీంద్రా పోస్టు చూశారా?

నూతన సంవత్సరం వేళ ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం అది సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 02 Jan 2023 01:25 IST

ముంబయి: మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సామాజిక మాధ్యమాల్లో (Social Media) చురుగ్గా ఉంటారు. ఆయన ఏ పోస్టు చేసినా కచ్చితంగా అది ఆసక్తికరంగానో లేదా ఆలోచింపజేసేది గానో ఉంటుంది. తాజాగా నూతన సంవత్సరం (Happy new Year 2023) సందర్భంగా ఆయన ఓ గిరిజన వ్యక్తి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఎలాంటి భయం, తడబాటులేకుండా ఎంతో సంతోషంగా ఆ వ్యక్తి చేస్తున్న డ్యాన్స్‌ చూస్తే.. మనం ఎన్ని బాధల్లో ఉన్నా.. వాటన్నింటినీ కొంతసేపు మర్చిపోవడం ఖాయం అనేలా ఉంది.

ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ..‘‘ 2022కి వీడ్కోలు పలికేందుకు నేను ఎంత ఆనందంతో డ్యాన్స్‌ చేయబోతున్నానో ఇక్కడ ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధం, కొవిడ్‌ మళ్లీ ప్రబలడం లాంటి ఘటనలు ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. అయితే, అలాంటి విపత్తులను ఈ కొత్త సంవత్సరం సమర్థంగా ఎదుర్కోవాలి’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడేందుకు అన్నిదేశాలూ కలిసి అడుగులు వేయాలంటూ కొందరు యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. 2023లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని