జూన్‌ 28 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 28 నుంచి ప్రారంభం కానుందని అమర్‌నాథ్‌ దేవస్థానం...

Published : 14 Mar 2021 01:17 IST

జమ్మూ: కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 28 నుంచి ప్రారంభం కానుందని అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన శనివారం ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అమర్‌నాథ్‌ యాత్రకు ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంకులకు చెందిన నిర్దేశించిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా గతేడాది కేవలం సాధువులకు మాత్రమే యాత్రకు అనుమతిచ్చారు. అంతకుముందు ఏడాది ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో అర్థాంతరంగా యాత్రను నిలిపివేశారు. మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా సగటున రెండున్నర నుంచి మూడున్నర లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని