Tamilnadu: కొవిడ్‌తో మరో సింహం మృతి

తమిళనాడులోని వందలూర్‌ జూలో కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలతో ఓ సింహం మృతిచెందగా.. అదే జూలో తాజాగా మరో మృగరాజు కరోనాతో మృతిచెందడం కలకలం రేపింది....

Published : 16 Jun 2021 20:32 IST

చెన్నై: తమిళనాడులోని వండలూర్‌ జూలో కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలతో ఓ సింహం మృతిచెందగా.. అదే జూలో తాజాగా మరో సింహం కరోనాతో మృతిచెందడం కలకలం రేపింది. జూలోని పద్మనాథన్‌ అనే 12 ఏళ్ల సింహం కొవిడ్‌తో ప్రాణాలు విడిచింది. జూన్‌ 3న ఆ సింహానికి కొవిడ్‌ సోకిందని, చికిత్స అందిస్తున్న క్రమంలో బుధవారం ఉదయం 10.15 గంటలకు మృతిచెందినట్లు జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘అనారోగ్యంతో ఉన్న ఆ సింహం నుంచి సేకరించిన నమూనాను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్‌ సెంటర్‌ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపించాం. కాగా ఆ సింహానికి కరోనా సోకినట్లు జూన్‌ 6న ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ వెల్లడించింది. అప్పటి నుంచి దానికి వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాం’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు. 

కొవిడ్‌తో మృతిచెందిన రెండో సింహం ఇది. జూన్‌ 3న తొమ్మిదేళ్ల మగ సింహం కొవిడ్‌ లక్షణాలతో మరణించింది. దీంతో ఆ జూలో ఉన్న మరో 11 సింహాల నమూనాలను సేకరించి ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీకు తరలించగా వాటిలో తొమ్మిదింటికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ జూ వద్దకు చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. సింహాలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని