Anthony Fauci : ఫౌచీపై వుహాన్ నీడలు..!
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీకై ఉండొచ్చనే సిద్ధంతం బలపడే కొద్దీ అమెరికాకు చెందిన అంటువ్యాధుల చికిత్స నిపుణులు
* మెయిల్స్ బయటకు రావడంతో మరిన్ని విమర్శలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీకై ఉండొచ్చనే వాదనలు బలపడే కొద్దీ అమెరికాకు చెందిన అంటువ్యాధుల చికిత్స నిపుణులు ఆంటోనీ ఫౌచీపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడా విమర్శలకు ఆజ్యం పోసేలా ఫౌచీ ఈమెయిల్స్ బహిర్గతం అయ్యాయి. వుహాన్ ల్యాబ్లో ఏమి జరుగుతోందో నిజంగా ఆయనకు తెలియదా..? లేదా అన్నీ తెలిసే.. అబద్ధాలు చెప్పారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఫౌచీ ఈమెయిల్స్.. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కింద బహిర్గతం అయ్యాయి. ఇందులో కొన్ని ఈమెయిల్స్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాస్కులపై ఆయన స్పందన, వుహాన్ ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని కొట్టిపారేయటం వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తొలి నాళ్లలో ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని బలంగా వ్యతిరేకించిన ఫౌచీ.. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మాట మార్చారు. ల్యాబ్ నుంచి లీకయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు.
కరోనా వ్యాపించిన తొలినాళ్లలో డాక్టర్ ఫౌచీకి.. ఇమ్యూనాలజిస్టు క్రిస్టియన్ జీ అండర్సన్ ఒక ఈమెయిల్ పంపించారు. దానిలో ‘‘ వైరస్కు ఉన్న అసాధారణ ఫీచర్లు చూస్తేంటే దీనిని ల్యాబ్ సెట్టింగ్స్లో మార్చారేమో అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. కానీ తర్వాత ఆయనే ల్యాబ్ లీక్ సిద్ధాంతానికి ఆధారాల్లేవు అని పత్రాన్ని సమర్పించారు. మరోపక్క డాక్టర్ ఫౌచీ ఈ వైరస్ ప్రకృతి సహజంగానే జంతువుల నుంచి మనుషుల్లోకి వ్యాపించిందనే వాదనలను ప్రచారం చేశారు. శాస్త్రవేత్తలను కూడా ఈ దిశగా రాయమని ఆయన సలహా కూడా ఇచ్చారు. వాస్తవానికి ఏ జంతువు నుంచి వచ్చిందో ఇప్పటికీ తెలియదు. కానీ, తాజాగా మాత్రం ఆయన కూడా ల్యాబ్ లీక్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక 2014-19 వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ హెల్త్ నుంచి ఎకోహెల్త్ అలయన్స్కు.. అక్కడి నుంచి వుహాన్ ల్యాబ్కు 3.4 మిలియన్ డాలర్లు వెళ్లాయి. ఆ సంస్థకు వుహాన్ ల్యాబ్తో సంబంధాలు ఉన్నాయి. దీని యజమాని పేరు పీటర్ డెస్జోక్. అతను 2020 ఏప్రిల్ 20వ తేదీ ఫౌచీకి ఒక మెయిల్ పంపించారు. దీనిలో ‘‘మా మిత్రులు , భాగస్వాముల తరపున మీరు నిలబడినందుకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెబుతున్నాను. వైరస్ పుట్టుక సహజమైనదే అన్న వాదనకు మీ మద్దతుతో శాస్త్రపరంగా బలం చేకూరింది. మీ వ్యాఖ్యలు ధైర్యంగా ఉన్నాయి. విశ్వసనీయమైన మీ నుంచి వచ్చే మాటలు వైరస్ పుట్టుకపై అనుమానాలను దూరం చేస్తాయి’’ అని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2020లో డాక్టర్ ఫౌచీ తన సహాయకుడు హ్యూజ్ ఔచిన్క్లోస్కు ఒక మెయిల్ పంపారు. దీనిలో కరోనా వైరస్లపై చేసిన గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ పరిశోధన పత్రం ఉంది. దీనిని చదవాలని హ్యూజ్ను ఫౌచీ ఆదేశించారు. దీనికి అతను స్పందిస్తూ.. ‘‘విదేశాల్లో జరిగిన ఈ పరిశోధనకు మనకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో తెలుసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ఎన్ఐహెచ్ నిధులను కరోనా వైరస్లపై పరిశోధనలకు వెచ్చించారు. ఆ నిధులతో వుహాన్ ల్యాబ్లో ఈ వైరస్లను మరింత ప్రమాదకరంగా , వేగంగా వ్యాపించేలా మార్చి ఉండవచ్చు. దీనిపై బుధవారం ‘న్యూస్ నేషన్ నౌ’ కార్యక్రమంలో ఫౌచీ స్పందించారు. తాము నమూనాల సేకరణకు మాత్రమే ఎకో హెల్త్ ఫౌండేషన్కు నిధులు సమకూర్చామని వెల్లడించారు. కానీ, వుహాన్ ల్యాబ్లో అన్నీ మేము అనుకున్నట్లే అవుతాయని హామీ ఇవ్వలేనని తెలిపారు. తన ఈమెయిల్స్ను తప్పుగా అన్వయించుకొంటున్నారని పేర్కొన్నారు. కరోనాపై దర్యాప్తు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని వాల్స్ట్రీట్ తన ఎడిట్లో కోరింది.
‘వుహాన్’ వైద్య నివేదికలు విడుదల చేయండి: ఫౌచీ
కరోనా వ్యాప్తికి ముందు కొద్ది రోజుల ముందు వుహాన్ ల్యాబ్లో అనారోగ్యానికి గురైన ముగ్గురు సిబ్బంది వైద్య నివేదికలు విడుదల చేయాలని పౌచీ కోరారు. ‘‘2019లో అక్కడ జబ్బుపడిన వారి వైద్య నివేదికలను నేను చూడాలనుకుంటున్నాను. వారు నిజంగానే జబ్బుపడ్డారా..? అలా అయితే వారు ఏ కారణంతో అనారోగ్యానికి గురయ్యారు’’ అని ఆయన పేర్కొన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
ఆధారాలు మాయం చేసి ఉంటారు: ఎంఐ6 మాజీ అధిపతి
వుహాన్ ల్యాబ్లో ఆధారాలను చైనా అధికారులు ఇప్పటికే ధ్వంసం చేసి ఉంటారని బ్రిటిష్ నిఘా సంస్థ ఎంఐ6 మాజీ డైరెక్టర్ సర్ రిచర్డ్ డియర్లోవ్ పేర్కొన్నారు. ‘‘వుహాన్ ల్యాబ్లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ పరిశోధనలు చేస్తున్నారని నిరూపించడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పటికే చాలా డేటాను ధ్వంసం చేయడం కానీ, మాయం చేయడం కానీ చేసి ఉంటారు. అక్కడ మహమ్మారి పుట్టుకకు కారణమైన పరిశోధనలు చేశారని నిరూపించలేము’’ అని పేర్కొన్నట్లు ది ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్