12 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్ ఎప్పుడు..?
12ఏళ్లలోపు చిన్నారులకు ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 176 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా.. ఇప్పటివరకు దాదాపు 150 కోట్ల డోసులను పంపిణీ చేశారు. అయితే, ఇప్పటివరకు ఆమోదం పొందిన వ్యాక్సిన్లు కేవలం పెద్దవారికి మాత్రమే ఇస్తున్నారు. ఇక చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలను ప్రారంభించిన శాస్త్రవేత్తలు.. వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 12ఏళ్లలోపు చిన్నారులకు ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘చిన్నారులకు వ్యాక్సిన్పై ఇప్పటికే ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో చిన్నారులకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యాక్సిన్ల ప్రభావం ఎంతకాలం ఉంటుందో స్పష్టంగా తెలియని తరుణంలో పెద్దవారి కోసం బూస్టర్ డోసు కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే మీజిల్స్ టీకా మాదిరిగా ఇవి జీవితాంతం రక్షణ కల్పించలేవు’ అని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణులు ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న 8 నుంచి 12 నెలల అనంతరం బూస్టర్ డోసు అవసరమయ్యే అవకాశం ఉంటుందని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ఈమధ్యే అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
ఇక భారత్లోనూ చిన్నారులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ను చిన్నారుల్లో ప్రయోగించేందుకు ఇక్కడి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. త్వరలోనే వీటి రెండు, మూడో దశ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు కొవాగ్జిన్ను 18ఏళ్ల వయసుపైబడిన వారికే అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని