EC: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్‌ చంద్ర పాండే

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనూప్‌ చంద్ర పాండే కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ కేంద్ర ఎన్నికల ప్రధాన

Updated : 09 Jun 2021 11:35 IST

దిల్లీ: రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనూప్‌ చంద్ర పాండే కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఏప్రిల్‌ 12న పదవీ విరమణ చేశారు. దీంతో ముగ్గురు సభ్యులు గల కమిషన్‌లో ఒక స్థానం ఖాళీ కావడంతో ఆ స్థానాన్ని అనూప్‌ చంద్ర పాండేతో భర్తీ చేశారు. అనూప్‌ చంద్ర పాండే 1984 బ్యాచ్‌ ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందినవారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనూప్‌ చంద్ర పాండే 2019లో పదవీ విరమణ పొందారు. ఎన్నికల కమిషన్‌లో అనూప్‌ చంద్ర పాండే మూడేళ్ల పాటు ఉండనున్నారు. 2024 ఫిబ్రవరి వరకు ఆయన పదవీ కాలం ఉంది. ముగ్గురు సభ్యులు గల ఎన్నికల కమిషన్‌లో ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర, కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ ఉన్నారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని