Boycott Culture: ‘బాయ్కాట్’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్
చలన చిత్రాల బహిష్కరణ సంస్కృతిని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఖండించారు. ఏదైనా సమస్య ఉంటే.. సంబంధిత విభాగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ముంబయి: సినిమాల ‘బాయ్కాట్’ ట్రెండ్పై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బహిష్కరణ సంస్కృతి(Boycott Culture)ని ఆయన ఖండించారు! ఒక సానుకూల శక్తిగా భారత్ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు యత్నిస్తోన్న సమయంలో.. ఇలాంటి వ్యవహారాలు స్థానిక వాతావరణాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏదైనా సినిమా విషయంలో ఎవరికైనా సమస్య ఉంటే.. సంబంధిత ప్రభుత్వ విభాగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్(Pathaan)’ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ఇటీవల పెద్దఎత్తున పిలుపులు వచ్చిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
షాంఘై సహకార సంస్థ(SCO) ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ముంబయి వచ్చిన కేంద్ర మంత్రి.. బాయ్కాట్ ట్రెండ్పై విలేకరులు అడిగిన ప్రశ్నపై ఈ మేరకు స్పందించారు. ‘ఒక సాఫ్ట్ పవర్గా భారత్ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోన్న సమయమిది. పైగా.. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఇలాంటి తరుణంలో బాయ్కాట్ వంటి పనులు వాతావరణాన్ని దెబ్బతిస్తాయి. కొన్నిసార్లు కేవలం ఇక్కడి సానుకూల వాతావరణాన్ని చెడగొట్టడానికే.. కొంతమంది ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండానే మాట్లాడతారు. దానివల్ల సమస్యలు వస్తాయి. ఇలా జరగకూడదు. ఏదైనా సినిమా విషయంలో ఎవరికైనా సమస్య ఉంటే.. సంబంధిత ప్రభుత్వ విభాగాన్ని సంప్రదించాలి. ఆ విభాగం.. నిర్మాతలు, దర్శకులతో చర్చిస్తుంది’ అని ఠాకూర్ అన్నారు.
సృజనాత్మకత విషయంలో స్వేచ్ఛ ఆవశ్యకతను చాటిచెబుతూ.. ఓటీటీ ప్లాట్ఫాంలలోని కంటెంట్ను పర్యవేక్షించడానికి తగిన వ్యవస్థలు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. సృజనాత్మకతపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొన్నారు. ‘ఓటీటీ ప్లాట్ఫాంలలోని కంటెంట్పై అభ్యంతరాలను సమాచార, ప్రసారశాఖ స్వీకరిస్తుంది. అయితే, దాదాపు 95 శాతం ఫిర్యాదులు నిర్మాతల స్థాయిలోనే పరిష్కారమవుతాయి. మిగతావి కంటెంట్ పబ్లిషర్స్ సంఘం స్థాయిలో కొలిక్కివస్తాయి. ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీకి కేవలం ఒక శాతం ఫిర్యాదులు మాత్రమే వస్తాయి. అలాంటి సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి ఠాకూర్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు