ఇకపై అక్కడ ఎవరైనా భూమి కొనొచ్చు!

జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో ఇకపై ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన భూ చట్టాల నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. .......

Published : 28 Oct 2020 00:56 IST

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన కేంద్రం

దిల్లీ: జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో ఇకపై ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన భూ చట్టాల నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం భారతీయ పౌరులెవరైనా జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో భూవిక్రయాలు జరపవచ్చు. జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసిగా ఉన్నవారే అక్కడ భూమి కొనుక్కోవచ్చని గతంలో ఉన్న డొమిసైల్‌ ఆప్షన్‌ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా తొలగించింది.  

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి అక్కడి చట్టాల్లో కీలక మార్పులు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని