Agnipath scheme: ‘అగ్నిపథ్’పై వెనక్కి తగ్గని కేంద్రం.. కోటా సంగతి తేల్చని రాష్ట్రాలు..!
Agnipath scheme: నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చే అగ్నివీరుల కోసం ఇప్పటి వరకు అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రాలు గానీ ఎలాంటి స్పష్టమైన ప్రణాళికను ప్రకటించకపోవడం గమనార్హం.
దిల్లీ: అగ్నిపథ్ స్కీమ్ (Agnipath scheme)పై ఓ వైపు ఆందోళనలు కొనసాగుతున్నా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తొలి ఏడాది వయసు విషయంలో సడలింపులు ఇచ్చిన కేంద్రం.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. రెగ్యులర్ సర్వీసులో వీరికి ప్రాధాన్యం ఇస్తామని కూడా ప్రకటించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించగా.. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకతను వ్యక్తంచేశాయి. ఈ విషయంలో రాజకీయ కారణాలు ఎలా ఉన్నా.. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చే అగ్నివీరుల కోసం ఇప్పటి వరకు అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రాలు గానీ ఎలాంటి స్పష్టమైన ప్రణాళికను ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో వారి భవిష్యత్పై నీలినీడలు అలుముకొన్నాయి.
Also Read: 4 ఏళ్ల తర్వాత ఇంటికే..ఆ తర్వాతే రెగ్యులర్ సర్వీసు కోసం దరఖాస్తు!
జూన్ 14న అగ్నిపథ్ స్కీమ్ను (Agnipath scheme) కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ప్రకటించిన వెంటనే ఉత్తరాదిలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకూ పాకాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ఛాయలు కనిపించాయి. ఈ నేపథ్యంలో యూపీ, మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, అస్సాం వంటి భాజపా పాలిత రాష్ట్రాలు పోలీసు నియామకాల్లో అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రకటనల వరకు బాగానే ఉన్నా.. ఈ ప్రక్రియ అంత సులువేమీ కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కేంద్ర సాయుధ దళాల్లో పనిచేసిన అగ్నివీరులకు రాష్ట్ర పోలీసు నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడమనేది వీలుకాదని ఓ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ అధికారి తెలిపారు. ఆర్మీలో రిజర్వేషన్లు ఉండవని, ఒకవేళ రాష్ట్ర పోలీసు నియామకాల్లో కోటాకు అవకాశం ఇస్తే అగ్నివీరులుగా చేరని వారు నష్టపోతారని చెప్పారు. ఈ కారణంగా బాగా చదువుకున్న యువత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరడం కష్టతరమవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రకటనలో ముందు.. ఆచరణలో వెనక
- అగ్నిపథ్ స్కీమ్ గురించి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెంటనే స్పందించారు. అగ్నివీరులుగా పనిచేసిన వారికి హరియాణా పోలీస్ జాబ్ లేదంటే గ్రూప్-సి పోస్టు ఇస్తామని ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు ఆ రాష్ట్రం ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తుందనేది వెల్లడించలేదు.
- ఉత్తరాఖండ్ సైతం ఇలాంటి ప్రకటనే చేసింది. అగ్నివీరులను పోలీసు, డిజాస్టర్, ఛార్దామ్ మేననేజ్మెంట్ శాఖల్లో కోటా ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. అయితే, ఎంత శాతం కోటా అనేది వెల్లడించలేదు. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఉత్తరాఖండ్ పూర్వ సైనిక్ కల్యాణ్ నిగమ్ లిమిటెడ్ (UNPL) ఉంది. దీని ద్వారా 30-35 వేల మంది ఎక్స్ సర్వీస్మెన్లకు ఉద్యోగం కల్పించినట్లు ఆ రాష్ట్ర సీఎస్ తెలిపారు. వారంతా వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ప్యూన్లు, క్లర్క్లుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
- ఉత్తర్ప్రదేశ్, మధ్య ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు సైతం అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించాయి. కానీ ఎంత శాతం? ఎలా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని యూపీకి చెందిన పోలీసు అధికారి తెలపగా.. రిజర్వేషన్ల అంశం పరిశీలనలో ఉందని, దానికింకా గడువు ఉందని మధ్యప్రదేశ్కు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
- భాజపా పాలిత రాష్ట్రమైన గుజరాత్ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
వ్యతిరేకిస్తున్న ఎన్డీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు
మరోవైపు భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ పథకాన్నే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. పథకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలంటూ రాజస్థాన్ కేబినెట్ తీర్మానం కూడా చేసింది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం ఈ పథకం రద్దుకు డిమాండ్ చేశారు.
- ఛత్తీస్గఢ్లో కానిస్టేబుల్ నియామకాల్లో ప్రస్తుతం హోంగార్డులకు 25 శాతం, అసిస్టెంట్ కానిస్టేబుల్స్కు 15 శాతం, ఎక్స్ సర్వీసుమెన్లకు 10 శాతం కోటా ఇస్తున్నామని ఆ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ కమిషనర్ దీపాన్షు కబ్రా తెలిపారు. ఒకవేళ అగ్నివీరులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తే యువతకు ప్రాధాన్యమివ్వాలన్న లక్ష్యం దెబ్బతింటుందని చెప్పారు. ఇప్పటికే ఇస్తున్న ఎక్స్-సర్వీస్మెన్ కోటాలోనే వారికీ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
- పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటి వరకు అగ్నివీరుల నియామకంపై ఎలాంటి ఆలోచనా చేయలేదని ఆ రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే అప్పుడు ఆలోచిస్తామని పేర్కొన్నారు.
- దక్షిణాది విషయానికొస్తే భాజపా అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా అగ్నివీరుల అంశంపై చర్చించలేదని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఏపీ ప్రభుత్వం సైతం దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ఈ పథకాన్ని వ్యతిరేకిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?