china: ‘ఎయిర్ ఇండియా’ హ్యాకింగ్ వెనుక డ్రాగన్..!
ప్రపంచలోని వ్యాపార సంస్థలపై చైనా గూఢచారులు కన్నేశారు. సైబర్ దాడులు చేసి విలువైన సమచారాన్ని కొల్లగొడుతున్నారు. భారత్లోని సంస్థలు కూడా వీరి రాడార్లో ఉన్నాయి.
ఏపీటీ41పై నిపుణుల అనుమానాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా గూఢచారులు కన్నేశారు. సైబర్ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. భారత్లోని సంస్థలు కూడా వీరి రాడార్లో ఉన్నాయి. గత నెలలో ‘ఎయిర్ ఇండియా’పై సైబర్దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45లక్షల మంది ప్రయాణికుల వివరాలను వీరు తస్కరించినట్లు సమాచారం. వీటిల్లో పాస్పోర్టు వివరాలు, క్రెడిట్కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి. ఈ విషయంపై సింగపూర్కు చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అంచనాకు వచ్చింది.
గతనెలలో ఎయిర్ ఇండియాకు చెందిన కీలక కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. ఈ ఘటనపై సింగపూర్కు చెందిన ‘గ్రూప్-ఐబి’ దృష్టిపెట్టింది. ప్రపంచ విమానయాన రంగంపై చైనా నిఘా పెట్టిందని.. దానిలో భాగంగానే ఈ హ్యాకింగ్ జరిగిందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ ప్రతిక పేర్కొంది. చైనా ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న ఏపీటీ41 అనే హ్యకింగ్ బృందం హస్తం ఉన్నట్లు వెల్లడించింది. ఇదే హ్యాకింగ్ ముఠా అమెరికాలో దాదాపు 100 సంస్థల నుంచి సమాచారం తస్కరించింది. ఇది గతేడాది సెప్టెంబర్ నుంచి ఎఫ్బీఐ మోస్ట్వాంటెడ్ జాబితాలో ఉంది.
సర్వర్ ఆధారంగా గుర్తింపు..!
ఎయిర్ ఇండియాపై దాడి చేసిన హ్యాకర్లు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ వినియోగించినట్లు గ్రూప్-ఐబీ పేర్కొంది. హ్యాకింగ్ కోసం ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ను వినియోగించుకొన్నట్లు వెల్లడించింది. వినియోగించిన ఐపీ అడ్రస్ను పరిశీలిస్తే ఏటీపీ41 పనిగా అర్థమైంది. కొన్నాళ్ల క్రితం మైక్రోసాఫ్ట్.. ఏటీపీ41 వినియోగిస్తున్న సర్వర్ ఐపీ అడ్రస్ను గుర్తించింది. తాజాగా గ్రూప్-ఐబీ గుర్తించిన ఐపీ అడ్రసుల్లో ఒకటి దీనికి సరిపోలింది. అంతేకాదు ఈ హ్యాకింగ్ కోసం వినియోగించిన మాల్వేర్ను కూడా గతంలో ఏపీటీ 41 వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. కాకపోతే పూర్తి స్థాయిలో ధ్రువీకరించడానికి మరింత బలమైన ఆధారాలు అవసరమని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు.
గ్రూప్-ఐబీ సంస్థ గతేడాది ఇంటర్పోల్తో కలిసి పనిచేసింది. నవంబర్లో టీఎంటీ పేరుతో నైజీరియా నేరగాళ్ల హ్యాకింగ్ గుట్టును బయటపెట్టింది. ఈ ముఠా 50వేల సంస్థలను హ్యాక్ చేసింది.
విమానయాన పరిశ్రమపై కన్ను..
ప్రపంచంలోని విమానయాన పరిశ్రమపై జరుగుతున్న సైబర్ దాడుల్లో భాగంగా ఎయిర్ ఇండియా హ్యాకింగ్ చోటు చేసుకొందని గ్రూప్ ఐబీ అంచనా వేస్తోంది. విమానయాన సంస్థలకు డేటా ప్రాసెసింగ్ సేవలు అందించే ఎస్ఐటీఏ అనే ఐటీ సంస్థ మార్చిలో హ్యాకింగ్కు గురైంది. ఆ సమయంలో కూడా ప్రయాణికుల సమాచారం లీకైంది. ఎస్ఐటీఏ హ్యాకింగ్ నుంచే సమస్యలు మొదలయ్యాయి అని ఎయిర్ ఇండియా కూడా పేర్కొంది. కానీ, దీనిని ఎస్ఐటీఏ మాత్రం తోసిపుచ్చింది. ఎయిర్ ఇండియా హ్యాకింగ్ వేరే అంశమని పేర్కొంది. ఎస్ఐటీఏ కేసును దర్యాప్తు చేసిన మాన్డియంట్ సంస్థ కీలక విషయాలను పసిగట్టింది. ఈ దాడి వెనుక వాడిన వ్యూహాలు, సాంకేతికత, విధానాలు మొత్తం ఒక సంస్థ హస్తాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. అంతకు మించిన వివరాలు వెల్లడించలేదు.
ఏపీటీ 41 హ్యాకర్లు గతంలో కూడా ట్రావెల్ మార్కెట్లోని సంస్థలను లక్ష్యంగా చేసుకొన్నారు. ఇందుకోసం వారు ఆయా కంపెనీలకు సేవలు అందించే ఇతర సంస్థల కంప్యూటర్లను ఎంచుకొని వాటిని ఆధీనంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ట్రావెల్ కంపెనీల కంప్యూటర్లలోకి మాల్వేరు చేరుతుంది. ఈ విధానాన్ని సప్లై చైన్ అటాక్స్ అని అంటారు. గత 15ఏళ్లుగా ఏపీటీ 41 పలు దేశాల్లో సైబర్ దాడులు చేస్తోంది. ఇటీవల అమెరికాలో జరుగుతున్న భారీ రాన్సమ్వేర్ సైబర్ దాడుల వెనుక కూడా దీని హస్తం ఉండే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ