పాంగాంగ్ సరస్సులోకి కొత్త పడవలు..!
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో లద్దాఖ్లోని పాంగంగ్ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకొంటోంది.
ఇంటర్నెట్డెస్క్: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా దాదాపు 17 మర పడవల కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఆర్డర్ను కూడా గోవాలోని ఒక నౌకల తయారీ కంపెనీకి ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందుకోసం పలు దఫాలుగా ఇరు దేశాల కోర్ కమాండర్లు భేటీ అయ్యారు. ఇక గోగ్రాపోస్ట్, హాట్ స్ప్రింగ్స్ వద్ద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు.
గోవాకు చెందిన ఆక్వారియుస్ షిప్యార్డ్కు ఈ ఆర్డర్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ వేగంగా నడిచే బోట్లను తయారు చేస్తుంటుంది. భారత నావికదళ కమాండర్ అభిలాష్ టామీ ఫ్రాన్స్లోని గోల్డెన్ గ్లోబ్ రేసులో పాల్గొనేందుకు అవసరమైన బోట్ను ఈ కంపెనీ చేసింది. ఇటువంటి బోట్లను నావికాదళం కూడా వినియోగిస్తోంది. 35 అడుగుల పొడవు ఉండే ఈ బోటు 20-22 మందిని తరలించగలదు. గంటకు 20నాట్ల స్పీడు(37 కిలోమీటర్ల)తో ఇది ప్రయాణిస్తుంది. అవసరమైతే దీనికి తేలిక పాటి ఆయుధాలను కూడా అమర్చవచ్చు. దీనిని పూర్తిగా ఫైబర్ గ్లాస్తో తయారు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్