Army: గ్రనేడ్‌ పేలి కెప్టెన్‌, జేసీవో మృతి..!

నియంత్రణ రేఖ సమీపంలో పొరబాటున గ్రనేడ్‌ పేలి ఓ ఆర్మీ కెప్టెన్‌, జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్‌ సెక్టార్‌లో చోటు చేసుకొంది.

Published : 18 Jul 2022 19:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నియంత్రణ రేఖ సమీపంలో పొరబాటున గ్రనేడ్‌ పేలి ఓ ఆర్మీ కెప్టెన్‌, జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్‌ సెక్టార్‌లో చోటు చేసుకొంది. దీనిపై రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ దేవేంద్ర ఆనంద్‌ స్పందిస్తూ మంధర్‌ సెక్టర్‌లో విధి నిర్వహణ సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని వెల్లడించారు. మృతులను కెప్టెన్‌ ఆనంద్‌, నాయిబ్‌ సుబేదార్‌ భగవాన్‌ సింగ్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. 

ఈ ప్రమాదం చోటు చేసుకోగానే గాయపడిన వారిని హుటాహుటిన హెలికాప్టర్‌లో ఉధంపూర్‌ కమాండ్‌ ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ అక్కడ వారు ప్రాణాలు విడిచినట్లు రక్షణశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఘటనపై వైట్‌నైట్‌ కోర్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండ్‌ (జీవోసీ) స్పందించారు. వారు విధినిర్వహణలో భాగంగా ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ.. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని