Army: గ్రనేడ్ పేలి కెప్టెన్, జేసీవో మృతి..!
నియంత్రణ రేఖ సమీపంలో పొరబాటున గ్రనేడ్ పేలి ఓ ఆర్మీ కెప్టెన్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో చోటు చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: నియంత్రణ రేఖ సమీపంలో పొరబాటున గ్రనేడ్ పేలి ఓ ఆర్మీ కెప్టెన్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో చోటు చేసుకొంది. దీనిపై రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ దేవేంద్ర ఆనంద్ స్పందిస్తూ మంధర్ సెక్టర్లో విధి నిర్వహణ సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని వెల్లడించారు. మృతులను కెప్టెన్ ఆనంద్, నాయిబ్ సుబేదార్ భగవాన్ సింగ్గా గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదం చోటు చేసుకోగానే గాయపడిన వారిని హుటాహుటిన హెలికాప్టర్లో ఉధంపూర్ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ అక్కడ వారు ప్రాణాలు విడిచినట్లు రక్షణశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఘటనపై వైట్నైట్ కోర్ జనరల్ ఆఫీసర్ కమాండ్ (జీవోసీ) స్పందించారు. వారు విధినిర్వహణలో భాగంగా ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ.. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా