Jammu Kashmir: కుప్వారాలో పర్యటించిన జనరల్‌ మనోజ్‌పాండే

చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా (Kupwara) సెక్టార్‌లో పర్యటించారు. నియంత్రణ రేఖ వెంబడి వివిధ ఎత్తైన ప్రదేశాల్లో మోహరించిన దళాలను సందర్శించారు.

Published : 01 Jan 2023 18:54 IST

కుప్వారా: నూతన సంవత్సర ప్రారంభం (Happy new Year 2023) సందర్భంగా చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే (Genaral Manoj Pandey) జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా (Kupwara) సెక్టార్‌లో పర్యటించారు. నియంత్రణ రేఖ వెంబడి వివిధ ఎత్తైన ప్రదేశాల్లో మోహరించిన దళాలను సందర్శించారు. వారితో సరదాగా మాట్లాడుతూ బాగోగులు తెలుసుకున్నారు. వారిలో స్ఫూర్తి నింపారు. సైనికులు, వారి కుటుంబాలకు మనోజ్‌పాండే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సైనికులు, జాగిలాల నుంచి సైనిక వందనం స్వీకరించిన ఆయన వారిలో స్ఫూర్తి నింపారు. సరిహద్దు భద్రతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సైనికులంతా అతడితో ఫొటోలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని