Bipin Rawat: సైన్యంలో దిశా నిర్దేశకుల ప్రాణాలకు అత్యంత విలువ..!
ఈ ఏడాది ధ్రువ్ అడ్వాన్స్డు లైట్ హెలికాప్టర్ హఠాత్తుగా గుజరాత్లోని ఖేడ్ జిల్లా వద్ద పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్
హెలికాప్టర్ ప్రయాణంపై అందుకే ఆంక్షలు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఈ ఏడాది ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ హఠాత్తుగా గుజరాత్లోని ఖేడ్ జిల్లా వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ రాజ్శుక్లా, వాయుసేన సౌత్వెస్ట్రన్ కమాండ్ అధిపతి ఎయిర్ మార్షల్ సురేంద్ర కుమార్ దానిలో ప్రయాణిస్తున్నారు. వీరు గుజరాత్ కెవడియాలో జరుగుతున్న కంబైన్డ్ కమాండర్స్ సదస్సుకు వెళుతున్నారు. హెలికాప్టర్లో సమస్య రావడంతో వారిని వేరే మార్గంలో గమ్య స్థానాలకు చేర్చారు. అత్యున్నత స్థాయి 3స్టార్ కమాండర్లను ఒకే హెలికాప్టర్లో పంపడంపై అప్పట్లో రక్షణశాఖపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ఆర్మీ సంతృప్తికర వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆకస్మిక మృతి భారత సైన్యానికి తీరని లోటు. ప్రభుత్వం/ప్రముఖ సంస్థల్లో పనిచేసే వ్యూహకర్తల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఉంటంది. మరీ ముఖ్యంగా భారత సైన్యంలో ప్రాణానికి అత్యంత విలువనిస్తారు. అదే సమయంలో కొన్ని వేల మందికి సరైనా దిశా నిర్దేశం చేయగలిగే వ్యక్తి ప్రాణాలకు మరింత విలువ ఉంటుంది. అందుకే టాప్ జనరల్స్ రక్షణ విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడదు. ఎందుకంటే సైన్యాన్ని నడిపించే వ్యూహకర్తలు వీరే. ఒక మంచి వ్యూహకర్తను కోల్పోవడం అంటే.. ఆ మేరకు ఆపరేషన్ నిర్వహణ శక్తి దెబ్బతిన్నట్లే లెక్క. అందుకే భారత్లో ఇద్దరు 3స్టార్ జనరల్స్ కలిసి ఒకే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లో ప్రయాణించరు. ఇది భారత ఆర్మీ ప్రొటోకాల్స్కు విరుద్ధం. ఖేడ్ఘటనలో వాడిన ధ్రువ్ హెలికాప్టర్ ట్విన్ ఇంజిన్ది కావడంతో సైన్యం ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించింది.
సింగల్ ఇంజిన్ హెలికాప్టర్పై ఎందుకు ఆంక్షలు..?
1963 నవంబర్ 22వ తేదీన జరిగిన ఓ ఘోర ప్రమాదం భారత సైన్యానికి గట్టి హెచ్చరికలా పనిచేసింది. దేశంలోని అత్యంత సీనియర్ జనరల్స్ ఆరుగురు ఈ ప్రమాదంలో మరణించారు. కశ్మీర్లోని పూంచ్కు వచ్చే నీరు, విద్యుత్తు వంటి వాటిని దెబ్బతీసేందుకు పాక్ దళాలు ఆక్రమిత కశ్మీర్లోని ఒక డ్యామ్ను పేల్చివేశాయి. దీంతో సైన్యం మరోకటి నిర్మాణం చేపట్టింది. దీనిని పరిశీలించేందుకు నాటి వెస్ట్రన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దౌలత్ సింగ్, ఎయిర్ వైస్ చీఫ్ మార్షల్ ఈడబ్ల్యూ పింటో, వెస్ట్రన్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ బిక్రమ్ సింగ్, 15వ కోర్ జీవోసీ మేజర్ జనరల్ కేఎన్డీ నానావతి, జనరల్ ఆఫీసర్ 25 ఇన్ఫ్రాంట్రీ డివిజన్ బ్రిగేడియర్ ఎస్ఆర్ ఒబెరాయ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎస్.ఎస్.సిద్ధూ కలిసి సింగిల్ ఇంజిన్ విమానమైన చేతక్లో బయల్దేరి వెళ్లారు. ఆ విమానం టెలిఫోన్ వైర్లను తాకి పూంచ్లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు అధికారులూ చనిపోయారు. అదే రోజు అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు గురికావంతో ఈ వార్త మీడియా దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. అయితే.. భారత ప్రభుత్వం ఈ ప్రమాదం అనంతరం టాప్ జనరల్స్ ప్రయాణాల ప్రొటోకాల్పై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
* 1997లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో కూడా రక్షణ బలగాలకు గట్టి దెబ్బతగిలింది. అరుణాచల్ ప్రదేశ్లోని లుంగార్ సెక్టార్లో చోటు చేసుకొన్న ఈ ప్రమాదంలో రక్షణ శాఖ సహాయ మంత్రి ఎన్.వి.ఎన్ సోము, ఫోర్ మౌంటేన్ డివిజన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ ఆర్సీ నాగ్పాల్ సహా మరో ఇద్దరు మేజర్లు చనిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం