Army: హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు!
ఆకస్మిక హిమపాతం వల్ల ఏడుగురు సైనికులు గల్లంతయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అరుణాచల్ప్రదేశ్లోని ఎత్తయిన ప్రదేశం కమెంగ్ సెక్టార్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికులు పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో హిమపాతం సం
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక హిమపాతం వల్ల విధుల్లో ఉన్న ఏడుగురు సైనికులు గల్లంతయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఎత్తయిన ప్రదేశం కమెంగ్ సెక్టార్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికులు పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో హిమపాతం సంభవించిందని.. అందులోనే సైనికులు చిక్కుకుపోయారని అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భారీగా మంచుకురుస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారని, వారికి సహయంగా నిపుణుల బృందాన్ని కూడా ఎయిర్లిఫ్ట్ ద్వారా ఘటనాస్థలికి తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు