IndianArmy: ఆర్మీ ట్రక్కులో మంటలు.. ఐదుగురు జవాన్ల సజీవ దహనం

జమ్ముకశ్మీర్‌లో ఘోరం జరిగింది. ఆర్మీ ట్రక్కులో మంటలు చెలరేగి ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు.

Updated : 20 Apr 2023 18:28 IST

పూంచ్‌: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో రహదారిపై వెళుతున్న ఆర్మీ ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. పిడుగుపాటు వల్లే ట్రక్కులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బింభేర్‌ గాలి నుంచి పూంఛ్‌ జిల్లాలోని సాంగియోట్‌ వైపు వెళ్తుండగా మధ్యాహ్నం 3గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు సైనిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మృతిచెందడం విషాదకరమని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనకు గల అసలు కారణాలు మాత్రం తెలియరాలేదు.

మరోవైపు, ఉగ్రవాద దాడి జరిగి ఉంటుందా? అనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల ఘటన మరవకముందే ఈ విషాదం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై విచారణ చేయాలని సైనిక ఉన్నతాధికారులు ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని