190 విద్యార్థులు, 70 టీచర్లకు కరోనా..!
కేరళలో రెండు ప్రభుత్వ పాఠశాల్లోనే దాదాపు 260మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.
కేరళ మలప్పురంలో ఘటన
మలప్పురం: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. తాజాగా కేరళలో రెండు పాఠశాల్లోనే దాదాపు 260మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి తెరచుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా కేరళలోనూ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు కలిగిన పాఠశాలలో తొలుత ఓ పదో తరగతి విద్యార్థికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆ విద్యార్థి చదివే తరగతి మొత్తానికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, వారందరిలో వైరస్ బయటపడింది. ఇలా మలప్పురం జిల్లాలో రెండు ప్రభుత్వం పాఠశాలల్లోనే 190 మంది విద్యార్థులు, మరో 70మంది టీచర్లకు వైరస్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కేవలం నిన్న ఒక్కరోజే అక్కడి స్థానిక ఉన్నత పాఠశాలలో 150మంది విద్యార్థులు, 34మంది ఉపాధ్యాయులకు వైరస్ సోకినట్లు తేలింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అంతేకాకుండా వైరస్ సోకిన విద్యార్థుల కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆ రెండు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు, క్రిమిసంహారక చర్యలు చేపట్టారు.
ఇదిలాఉంటే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ క్రియాశీల కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే 81శాతం ఉన్నాయి. వీటిలో ఒక్క కేరళలోనే 45.70శాతం ఉండగా, మహారాష్ట్రల్లో 25.05శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటక (4.02), పశ్చిమ బెంగాల్ (3.23), తమిళనాడు (2.95) రాష్ట్రాల్లోనూ కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఇవీ చదవండి..
వుహాన్: కీలక ఆధారాలు లభ్యం
కేరళలో తొలి తల్లి పాల బ్యాంకు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.