Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్కు కాల్స్..!
అమృత్పాల్ సింగ్ వెనుకుండి కథ నడిపిన దల్జీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడి ఖాతాల్లోకి విదేశాల నుంచి రూ. 35 కోట్లు వచ్చినట్లు గుర్తించారు.
ఇంటర్నెట్డెస్క్: ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ ప్రైవేటు సైన్యం ఏర్పాటు కోసం విదేశాల నుంచి భారీగా నిధులను సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అతడి అనుచరుడిను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. అమృత్పాల్పై ఆపరేషన్ మొదలుపెట్టగానే పోలీసులు గురుగ్రామ్లో అతడి ప్రధాన అనుచరుడు దల్జిత్ సింగ్ ఖల్సీని అదుపులోకి తీసుకొన్నారు. అమృత్పాల్ తరపున ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు అనుబంధంగా ‘ఆనంద్పూర్ ఖల్సా ఫోర్స్’ ఏర్పాటు కోసం దల్జిత్ తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి ఫోన్ను విశ్లేషించిన అధికారులకు ఏకేఎఫ్ దళం గుర్రాలపై ఆయుధాలు చేతబూని ‘ఆనంద్పూర్ ఖల్సా ఫోర్స్’ పతాకాలతో ఉన్న వీడియోలు బయటపడ్డాయి. వారంతా తాము క్రిమినల్ కేసులకు భయపడం అని చెబుతుండటం వీడియోలో ఉంది. దల్జిత్ సింగ్ బ్యాంక్ ఖాతాల్లో గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ. 35 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు.
దల్జిత్ సింగ్ ఖల్సీ చరిత్ర మొత్తం మోసాల పుట్ట..
అమృత్పాల్, వారిస్ పంజాబ్ దేకు దల్జిత్ ప్రధాన ఫైనాన్షియర్గా వ్యవహరిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం దల్జిత్ దిల్లీలో ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ నిర్వహించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. గతంలో పలు మోసకారి పథకాలను ఇతడు నిర్వహించాడు. 2018లో తిరుమల తిరుపతి మల్టీ స్టేట్ కోపరేటీవ్ క్రెడిట్ సొసైటీ బోర్డు అనే సంస్థ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ సంస్థ ముంబయి కేంద్రంగా మల్టీలెవల్ మార్కెటింగ్ను నిర్వహించింది. ఈ సంస్థలో ఓ డైరెక్టర్పై గోవాలో డ్రగ్రాకెట్ కేసు నమోదైంది. ఈ సొసైటీతో మనీ లాండరింగ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాదు దల్జీత్ ఐకాన్స్ ఇన్ఫ్రాప్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకడు. ఈ సంస్థ 2013-16 మధ్య ఐటీ రిటర్న్లు ఫైల్ చేయడంలో విఫలమైంది. ఈ కంపెనీని రద్దు చేయాల్సి వచ్చింది. దల్జిత్ ఖల్సీతో స్టెర్లింగ్ ఇండియా అనే సంస్థలో ఉన్న ఓ భాగస్వామి పేరుపై నమోదైన ఆడీకారును అమృత్పాల్ వినియోగించేవాడు.
గతంలో భారత్కు వ్యతిరేకంగా కెనడాలోని వాంకోవర్లో పాకిస్థాన్ హైకమిషన్కు లేఖ సమర్పించిన ఖలిస్థాన్ నాయకుల బృందంలో దల్జీత్ కూడా ఉన్నాడు.
అమృత్పాల్ను అప్రమత్తం చేసిన ఫ్లాగ్ కారు..!
సాధారణంగా అమృత్పాల్ ప్రయాణించే మార్గంలో తొలత ఓ ఫ్లాగ్ కారు వెళుతుంది. అక్కడ అనుకోని పరిస్థితులు ఏమైనా ఉంటే గమనించి అమృత్పాల్ డ్రైవర్కు సమాచారం చేరవేస్తుంది. శనివారం పోలీసులు ఆపరేషన్ చేపట్టి హరికే అనే ప్రాంతం వద్ద కాపుకాశారు. కానీ, అక్కడే ఓ ప్రార్థనా మందిరం వద్ద ఉన్న ధాబా సమీపంలో అమృత్పాల్ ఉన్నాడు. అతడి పైలట్ కారు దాదాపు 2 కిలోమీటర్ల ముందు ఉంది. ఆ కారులోని వారు పోలీసుల మోహరింపును గమనించి ‘యూ’టర్న్ తీసుకొని అమృత్పాల్ వద్దకు చేరుకొని సమాచారం చేరవేశారు.
పరిస్థితిని వెంటనే అర్థం చేసుకొన్న అమృత్పాల్ మెర్సిడెస్ ఎస్యూవీ వాహనం వెంటనే యూటర్న్ తీసుకొంది. ఆ ఎస్యూవీని అక్కడే వదిలేసిన అమృత్పాల్ ఫ్లాగ్ కారులోనే వేరేమార్గంలో ఉడాయించాడు. ఈ కారులో అతడి డ్రైవర్ హరిప్రీత్తో సహా ఐదుగురు ఉన్నారు. అమృత్పాల్ మామ హిరిజీత్ సింగ్ కూడా దానిలో ఉన్నట్లు భావిస్తున్నారు. అతడు నేడు లొంగిపోయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య