Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్కు కాల్స్..!
అమృత్పాల్ సింగ్ వెనుకుండి కథ నడిపిన దల్జీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడి ఖాతాల్లోకి విదేశాల నుంచి రూ. 35 కోట్లు వచ్చినట్లు గుర్తించారు.
ఇంటర్నెట్డెస్క్: ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ ప్రైవేటు సైన్యం ఏర్పాటు కోసం విదేశాల నుంచి భారీగా నిధులను సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అతడి అనుచరుడిను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. అమృత్పాల్పై ఆపరేషన్ మొదలుపెట్టగానే పోలీసులు గురుగ్రామ్లో అతడి ప్రధాన అనుచరుడు దల్జిత్ సింగ్ ఖల్సీని అదుపులోకి తీసుకొన్నారు. అమృత్పాల్ తరపున ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు అనుబంధంగా ‘ఆనంద్పూర్ ఖల్సా ఫోర్స్’ ఏర్పాటు కోసం దల్జిత్ తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి ఫోన్ను విశ్లేషించిన అధికారులకు ఏకేఎఫ్ దళం గుర్రాలపై ఆయుధాలు చేతబూని ‘ఆనంద్పూర్ ఖల్సా ఫోర్స్’ పతాకాలతో ఉన్న వీడియోలు బయటపడ్డాయి. వారంతా తాము క్రిమినల్ కేసులకు భయపడం అని చెబుతుండటం వీడియోలో ఉంది. దల్జిత్ సింగ్ బ్యాంక్ ఖాతాల్లో గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ. 35 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు.
దల్జిత్ సింగ్ ఖల్సీ చరిత్ర మొత్తం మోసాల పుట్ట..
అమృత్పాల్, వారిస్ పంజాబ్ దేకు దల్జిత్ ప్రధాన ఫైనాన్షియర్గా వ్యవహరిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం దల్జిత్ దిల్లీలో ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ నిర్వహించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. గతంలో పలు మోసకారి పథకాలను ఇతడు నిర్వహించాడు. 2018లో తిరుమల తిరుపతి మల్టీ స్టేట్ కోపరేటీవ్ క్రెడిట్ సొసైటీ బోర్డు అనే సంస్థ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ సంస్థ ముంబయి కేంద్రంగా మల్టీలెవల్ మార్కెటింగ్ను నిర్వహించింది. ఈ సంస్థలో ఓ డైరెక్టర్పై గోవాలో డ్రగ్రాకెట్ కేసు నమోదైంది. ఈ సొసైటీతో మనీ లాండరింగ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాదు దల్జీత్ ఐకాన్స్ ఇన్ఫ్రాప్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకడు. ఈ సంస్థ 2013-16 మధ్య ఐటీ రిటర్న్లు ఫైల్ చేయడంలో విఫలమైంది. ఈ కంపెనీని రద్దు చేయాల్సి వచ్చింది. దల్జిత్ ఖల్సీతో స్టెర్లింగ్ ఇండియా అనే సంస్థలో ఉన్న ఓ భాగస్వామి పేరుపై నమోదైన ఆడీకారును అమృత్పాల్ వినియోగించేవాడు.
గతంలో భారత్కు వ్యతిరేకంగా కెనడాలోని వాంకోవర్లో పాకిస్థాన్ హైకమిషన్కు లేఖ సమర్పించిన ఖలిస్థాన్ నాయకుల బృందంలో దల్జీత్ కూడా ఉన్నాడు.
అమృత్పాల్ను అప్రమత్తం చేసిన ఫ్లాగ్ కారు..!
సాధారణంగా అమృత్పాల్ ప్రయాణించే మార్గంలో తొలత ఓ ఫ్లాగ్ కారు వెళుతుంది. అక్కడ అనుకోని పరిస్థితులు ఏమైనా ఉంటే గమనించి అమృత్పాల్ డ్రైవర్కు సమాచారం చేరవేస్తుంది. శనివారం పోలీసులు ఆపరేషన్ చేపట్టి హరికే అనే ప్రాంతం వద్ద కాపుకాశారు. కానీ, అక్కడే ఓ ప్రార్థనా మందిరం వద్ద ఉన్న ధాబా సమీపంలో అమృత్పాల్ ఉన్నాడు. అతడి పైలట్ కారు దాదాపు 2 కిలోమీటర్ల ముందు ఉంది. ఆ కారులోని వారు పోలీసుల మోహరింపును గమనించి ‘యూ’టర్న్ తీసుకొని అమృత్పాల్ వద్దకు చేరుకొని సమాచారం చేరవేశారు.
పరిస్థితిని వెంటనే అర్థం చేసుకొన్న అమృత్పాల్ మెర్సిడెస్ ఎస్యూవీ వాహనం వెంటనే యూటర్న్ తీసుకొంది. ఆ ఎస్యూవీని అక్కడే వదిలేసిన అమృత్పాల్ ఫ్లాగ్ కారులోనే వేరేమార్గంలో ఉడాయించాడు. ఈ కారులో అతడి డ్రైవర్ హరిప్రీత్తో సహా ఐదుగురు ఉన్నారు. అమృత్పాల్ మామ హిరిజీత్ సింగ్ కూడా దానిలో ఉన్నట్లు భావిస్తున్నారు. అతడు నేడు లొంగిపోయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం