Ragging: ర్యాగింగ్కు భయపడి.. రెండో అంతస్తు నుంచి దూకేసి..!
ర్యాగింగ్కు భయపడి అస్సాంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
దిస్పూర్: మన దేశంలో ర్యాగింగ్పై నిషేధం ఉన్నప్పటికీ.. ఇంకా ఈ విష సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ర్యాగింగ్ పేరుతో కొన్ని చోట్ల విద్యార్థులు హద్దులు దాటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒడిశాలోని ఓ విద్యార్థినిని ర్యాగింగ్ పేరిట లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే, ఇలాంటి ఘటనే తాజాగా అస్సాంలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ బాధితుడు అబ్బాయి కావడం గమనార్హం. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక, వారి నుంచి తప్పించుకునేందుకు దిబ్రూగఢ్ యూనివర్సిటీలో చదువుతున్న ఆనంద్ శర్మ అనే విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దిబ్రూగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైనట్లుగా భావిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. తాజా ఘటనపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. ర్యాగింగ్కు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులను కోరారు. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత విద్యార్థికి అన్నిరకాల వైద్యసదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
మద్యం తాగించి..హింసించేవారు: విద్యార్థి తల్లి
తన కొడుకును సీనియర్ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా వేధించేవారని బాధితుడి తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి డబ్బులు గుంజుకునే వారని, మొబైల్ లాక్కొని హింసించేవారని, కొన్నిసార్లు చంపేందుకు కూడా యత్నించారని అన్నారు. మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫొటోలు తీసేవారని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరించే వారని పోలీసులతో చెప్పారు. ‘‘ తీవ్రంగా ర్యాగింగ్ చేస్తున్నారంటూ గత నాలుగు నెలలుగా చెప్తూనే ఉన్నాడు. రాత్రంతా ర్యాగింగ్ చేసి హింసించారని ఫోన్ చేసి చెప్పాడు.’’ అని బాధితుడి తల్లి వాపోయారు. మరోవైపు సీనియర్ విద్యార్థులు తనపై ర్యాగింగ్కు పాల్పడుతున్నారంటూ ఈ నెల 17న హాస్టల్ వార్డెన్కు ఆనంద్ శర్మ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోవడం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Manipur Violence: మణిపుర్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
మణిపుర్లో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 13 మంది మృతి చెందారు. -
Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!
ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, ఆప్ నుంచి పోటీచేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడంతో తొలిసారిగా అసెంబ్లీలో వారికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. -
Railway: రైల్వే ‘బీస్ట్’ను చూశారా..? వైరల్ అవుతున్న వీడియో
Beast of Indian Railways: అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వీడియోను రైల్వే శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. దాన్ని రైల్వే బీస్ట్గా అభివర్ణించింది. -
Jobs: ఐఐటీ కాన్పూర్లో కొలువుల జోష్.. ఒకేరోజు 485మందికి జాబ్ ఆఫర్లు
ఐఐటీ కాన్పూర్లో కొలువుల జోష్ మొదలైంది.. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తొలిరోజే 485మందికి జాబ్ ఆఫర్లు వచ్చాయి. -
Raghav Chadha: ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డాపై సస్పెన్షన్ ఎత్తివేత
Raghav Chadha: ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డాపై విధించిన నిరవధిక సస్పెన్షన్ను రాజ్యసభ ఛైర్మన్ ఎత్తివేశారు. దీంతో మళ్లీ ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. -
Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్ ఫలితం అంతుపట్టడం లేదు!
మూడు రాష్ట్రాల్లో పార్టీ వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసుకుంటామని.. మధ్యప్రదేశ్లో మాత్రం ఏం జరిగిందో అనే విషయం ఇప్పటికీ అంతుపట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. -
Chennai Rains: కొట్టుకుపోయిన కార్లు.. రన్వేపైకి వరద.. చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలు
Chennai Rains: భారీ వర్షాలతో చెన్నై నగరం దాదాపు స్తంభించింది. పలు చోట్ల వరద బీభత్సం సృష్టించింది. ఎయిర్పోర్టులోకి వరద చేరి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. -
Udhayanidhi Stalin: నా మాటలను భాజపా వక్రీకరించింది.. సనాతన వివాదంపై ఉదయనిధి
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివరణ ఇచ్చుకొన్నారు. తన వ్యాఖ్యలను భాజపా, ప్రధాని మోదీ వక్రీకరించి వాడుకొన్నారని ఆరోపించారు. -
Mary Milliben: ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడు.. మూడు రాష్ట్రాల్లో భాజపా విజయంపై అమెరికన్ సింగర్
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ (Mary Milliben) ప్రశంసల జల్లు కురింపించారు. -
PM Modi: ‘మీ ఓటమి అసహనాన్ని పార్లమెంట్లో చూపించొద్దు’: కాంగ్రెస్కు మోదీ సూచన
PM Modi: అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు పట్టం కట్టిన ప్రజలు.. నెగెటివిటీని ప్రచారం చేసేవారిని ఓడించారని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఫలితాలపై స్పందించారు. -
Chennai: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. స్తంభించిన చెన్నై
మిగ్జాం తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం దాదాపు స్తంభించిపోయింది. -
మొయిత్రా అంశం అలజడి రేపుతుందా!
అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహం మీద ఉన్న భాజపా.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాలతో సిద్ధమవుతోంది. -
రక్తదానంపై ప్రచారం చేస్తూ 17,700 కి.మీ. పాదయాత్ర
దిల్లీకి చెందిన కిరణ్వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 17,700 కిలోమీటర్లు తిరిగారు. -
గోపాల్ భార్గవ.. తొమ్మిదోసారి..
మధ్యప్రదేశ్లో భాజపా దిగ్గజ నేతల్లో ఒకరైన గోపాల్ భార్గవ (71) రహ్లీ నియోజకవర్గంపై తన పట్టును మరోసారి చాటుకున్నారు. -
అటువంటి సందర్భంలో పరిమిత బెయిల్ చట్టవిరుద్థమే: సుప్రీం కోర్టు
ఏదైనా కేసులో నిందితుడు బెయిల్ పొడిగింపు పొందడానికి అర్హుడుగా తేలిన సందర్భంలో అతనికి పరిమిత కాల బెయిల్ మంజూరు చేయడం చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
Michaung Cyclone: నిజాంపట్నం వద్ద 10 నంబర్ ప్రమాద హెచ్చరిక.. తీరప్రాంత ప్రజల్లో ఉలిక్కిపాటు
-
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్లోనూ డేటా బూస్టర్ ప్లాన్.. ధర ఎంతంటే?
-
Kiara Advani: డ్యాన్స్ చేయమంటే నవ్వులు పంచిన కియారా: ఈ డ్రెస్సులో చేయలేనంటూ!
-
Telangana: ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా