ఆర్మీ క్యాంప్పై ఆత్మాహుతి దాడికి యత్నం.. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
స్వాతంత్ర్య దినోత్సవాల వేళ జమ్మూకశ్మీర్లో భీకర ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను సైన్యం భగ్నం చేసింది. ఆర్మీ క్యాంప్పై దాడికి యత్నించిన ఇద్దరు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు.
ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైనికులు
జమ్ము: స్వాతంత్ర్య దినోత్సవాల వేళ జమ్మూకశ్మీర్లో భీకర ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను సైన్యం భగ్నం చేసింది. ఆర్మీ క్యాంప్పై దాడికి యత్నించిన ఇద్దరు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు. అయితే ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. జమ్ము అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..
గురువారం తెల్లవారుజామున రాజౌరీ జిల్లాలోని పార్గల్లో గల ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ను దాటి లోపలికి వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. క్యాంప్లో ఆత్మాహుతి దాడి చేసేందుకు పన్నాగం పన్నారు. వీరిని గుర్తించిన ఆర్మీ సెంట్రీ వెంటనే కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమై ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. దీంతో ముష్కరులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అయితే ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గత ఆరు నెలలుగా రాజౌరీ ప్రాంతంలోనూ వరుస ఉగ్రదాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటన వెనుక లష్కరే తోయిబా ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పంద్రాగస్టు వేళ ముష్కరులు దేశవ్యాప్తంగా భారీ దాడులకు ప్రయత్నించే అవకాశముందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. నిన్న పుల్వామా జిల్లాలో ఓ రోడ్డు పక్కన 25 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. బడ్గామ్ జిల్లాలోనూ భద్రతా బలగాలు నిన్న ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా