- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Delhi: పాఠశాలల్లో ఆడిటోరియాన్ని వాడుకోవచ్చు!
దిల్లీ: దేశ రాజధానిలోని పాఠశాలల్లో ఆడిటోరియం, అసెంబ్లీ హాళ్లను వినియోగించుకునేందుకు దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ అనుమతిచ్చింది. అయితే, కేవలం విద్యాపరమైన శిక్షణ, సమావేశాలను మాత్రమే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఆడిటోరియాల్లో విద్యార్థులకు పాఠాలు బోధించకూడదని తెలిపింది. కరోనా నేపథ్యంలో దిల్లీలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అన్లాక్ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం.. దిల్లీ మెట్రో రైళ్లు, బస్సులు 50శాతం సామర్థ్యంతో నడిపించేందుకు ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా పాఠశాలల్లో ఆడిటోరియాలు, అసెంబ్లీ హాళ్లను శిక్షణ, సమావేశాల నిమిత్తం వాడుకోవచ్చని వెల్లడించింది. కాగా.. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు యథాతథంగా మూసివేసే ఉంటాయని పేర్కొంది. అలాగే.. సినిమాహాళ్లు, మల్టిప్లెక్స్, స్పాలు, థియేటర్లు, పార్కులు, ఇతర బహిరంగ సమావేశాలు, వేడుకలపై జులై 26 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొంది. దిల్లీలో మొత్తం నమోదైన కరోనా కేసులు 14,35,030 కాగా.. ప్రస్తుతం 792 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్కే ఎక్కువ అవకాశాలు..!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
-
India News
Nitish kumar: 10లక్షలు కాదు.. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: నీతీశ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Indian Army: సియాచిన్లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Flight: గర్ల్ఫ్రెండ్తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Crime News: బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
- Social Look: పారిస్ ప్రేమలో మెహరీన్.. ట్రెండ్ ఫాలో అయిన ప్రియా ప్రకాశ్!