Delta Fear: ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు!
డెల్టా వేరియంట్తో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి.
డెల్టా భయంతో వణుకుతున్న ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్
సిడ్నీ: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగాయి. అంతేకాకుండా అక్కడ వ్యాక్సిన్ పంపిణీని వేగంగా చేపడుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి. సిడ్నీలో వారంపాటు లాక్డౌన్ విధించారు. డెల్టా వేరియంట్ ఆఫ్రికాలోనూ విలయం సృష్టిస్తున్నట్లు అక్కడి సీడీసీ వెల్లడించింది. ఇప్పటికే డెల్టా వేరియంట్ దాటికి భారత్ కూడా వణికిపోయిన విషయం తెలిసిందే.
సిడ్నీలో లాక్డౌన్..
కరోనా నుంచి కోలుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. దీంతో సిడ్నీలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒకవారం పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. ఆస్ట్రేలియాలో గతవారంలోనే 65 పాజిటివ్ కేసులను గుర్తించారు. కరోనా మహమ్మారి బయటపడిన తర్వాత అత్యంత భయంకరమైన పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామని న్యూసౌత్వేల్స్ ప్రీమియర్ గ్లాడీస్ బెరెజిక్లెయిన్ పేర్కొన్నారు.
ఇండోర్లోనూ మాస్కులు: ఇజ్రాయెల్
ప్రపంచంలో అత్యధిక వేగంగా టీకా పంపిణీ చేస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ముందున్న విషయం తెలిసిందే. దీంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పదిరోజుల క్రితం ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న నాలుగు రోజులకే నిత్యం వంద కేసులు బయటపడడం మొదలయ్యింది. కేవలం గురువారం ఒక్కరోజు 227 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్, మాస్కుల నిబంధన సడలింపును ఎత్తివేసింది. ఇండోర్ ప్రాంతంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిస్థితిని బట్టి మరిన్ని ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. దేశంలో వైరస్ విజృంభణకు డెల్టా వేరియంట్ కారణం కావచ్చని ఇజ్రాయెల్లో కరోనాపై ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ఫోర్స్ చీఫ్ పేర్కొన్నారు.
ఫిజీలోనూ అదే తీరు..
కరోనా వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలో మహమ్మారిని కట్టడి చేయడంలో ఫిజీ విజయం సాధించింది. గడిచిన ఏడాది కాలంగా అక్కడ పాజిటివ్ కేసుల జాడ కనిపించలేదు. కానీ, తాజాగా అక్కడి కొవిడ్ ఉద్ధృతి మళ్లీ మొదలయ్యింది. గురవారం ఒక్కరోజే 300 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఏప్రిల్ నెలలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్తో మళ్లీ విజృంభణ మొదలైనట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఫిజీ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో మరోసారి కొవిడ్ కట్టడి ఆంక్షలకు ఉపక్రమించారు.
ఆఫ్రికాలో థర్డ్వేవ్..
డెల్టా వేరియంట్ ఉద్ధృతితో ఆఫ్రికా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 14 దేశాల్లో ఈ వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా గడిచిన మూడు వారాలుగా వైరస్ విజృంభణ మరింత ఎక్కువైనట్లు ఆయా దేశాలు వెల్లడిస్తున్నాయి. ఆఫ్రికా ఖండాన్ని మూడో వేవ్ తాకిందని ఆఫ్రికాలోని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (ఆఫ్రికా సీడీసీ) డైరెక్టర్ జాన్ కెంగాసాంగ్ వెల్లడించారు. ఈ ధఫా విజృంభణతో మరింత దారుణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్ ప్రభావం కాంగో, ఉగాండాలో మరింత ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.