భారత్.. ఎలుకల్ని చంపే విషం ఎగుమతి చేయవా?
కరోనా కట్టడి కోసం భారత్కు చెందిన రెండు సంస్థలు వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. వాటిని తమ దేశాలకు ఎగుమతి చేయాలంటూ అనేక దేశాలు విజ్ఞప్తి చేస్తోన్న వేళ.. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం మాత్రం భారత్ను మరో విచిత్రమైన సాయం అడుగుతోంది. ఎలుకల్ని చంపడానికి ఉపయోగించే
అభ్యర్థిస్తోన్న ఆస్ట్రేలియన్ స్టేట్
సిడ్నీ: కరోనా కట్టడి కోసం భారత్కు చెందిన రెండు సంస్థలు వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. వాటిని తమ దేశాలకు ఎగుమతి చేయాలంటూ అనేక దేశాలు విజ్ఞప్తి చేస్తోన్న వేళ.. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం మాత్రం భారత్ను మరో విచిత్రమైన సాయం అడుగుతోంది. ఎలుకల్ని చంపడానికి ఉపయోగించే ప్రమాదకర విషం బ్రోమాడియోలోన్ను సరఫరా చేయాలని కోరుతుంది.
ఇటీవల గ్రామీణ ఆస్ట్రేలియాలో ఎలుకల బెడద తీవ్రమైంది. పెద్ద సంఖ్యలో ఎలుకలు పంటలపై దాడి చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. నిత్యం వేలకొద్ది ఎలుకల మృత దేహాలు వ్యవసాయ క్షేత్రాల్లో బయటపడుతున్నాయి. వాటి వల్ల ప్లేగు వ్యాధి ప్రబలుతుండటంతో అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలుకల్ని చంపడానికి బ్రోమాడియోలోన్ను ప్రయోగించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం ఎలుకలతోపాటు జీవకోటికి ప్రమాదకరం. అందుకే ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు బ్రోమాడియోలోన్ను నిషేధించాయి.
కాగా.. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం మాత్రం తమ ప్రాంతంలో ఎలుకల్ని చంపడానికి 5వేల లీటర్ల బ్రోమాడియోలోన్ విషాన్ని ఎగుమతి చేయాలని భారత్ను కోరుతోంది. ఇందుకోసం 50మిలియన్ డాలర్ల నిధులను సైతం విడుదల చేసింది. అయితే, న్యూ సౌత్ వేల్ ప్రతిపాదనకు ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఈ విషం వల్ల మిగతా జంతువులకు ప్రాణహాని ఉంటుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి న్యూ సౌత్ వేల్స్ అభ్యర్థనను అక్కడి ప్రభుత్వం.. భారత్ ఆమోదిస్తాయో లేదో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.