బర్డ్‌ ఫ్లూపై నివేదికలివ్వండి..

దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వణ్యప్రాణుల విభాగాలు బర్డ్‌ఫ్లూపై నివేదికలు సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆదేశించింది.

Published : 05 Jan 2021 22:26 IST

రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళ

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వణ్యప్రాణుల విభాగాలు బర్డ్‌ఫ్లూపై నివేదికలు సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆదేశించింది. భారత్‌లోని హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బర్డ్‌ఫ్లూను అన్ని రాష్ట్రాలు తీవ్రంగా పరిగణించి అప్రమత్తంగా ఉండాలని కేంద్రం పేర్కొంది. బర్డ్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని అదుపులో ఉంచేందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. రాష్ట్రాల్లో పక్షుల మరణాలపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో 2,300 వలస పక్షులు బర్డ్‌ఫ్లూ బారిన పడి మరణించినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ ధ్రువీకరించింది. సుమారు 57వేల వలస పక్షులు వలస వచ్చినట్లు అంచనా వేస్తున్నామని వారు తెలిపారు. మరణించిన పక్షులను నిబంధనలకు అనుగుణంగా ఖననం చేస్తున్నామని వెల్లడించారు. కేరళలోని రెండు జిల్లాల్లో 40వేలకు పైగా బాతులు మృత్యువాత పడటంతో బర్డ్‌ఫ్లూను రాష్ట్ర విపత్తుగా ప్రకటించి ఆ రెండు జిల్లాల్లో హైఅలర్ట్‌ను ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్‌లో 15 రోజుల పాటు కోడిమాంసం, కోడిగుడ్ల దుకాణాలను మూసేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి..

పదిరోజుల్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ షురూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు