Covid: స్వాతంత్ర్య దినోత్సవం నాడు గుమిగూడొద్దు.. కేంద్రం సూచన

దేశంలో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు గుమిగూడకుండా చూడాలని........

Updated : 12 Aug 2022 16:27 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరింది. వ్యాధి సంక్రమణకు గురికాకుండా అవసరమైన అన్ని కొవిడ్‌ నియమాలను పాటించాలని పేర్కొంది.

దేశంలో కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా 15వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. గురువారం 3.04 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,561 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 5.44 శాతంగా నమోదైంది. నిన్న 49 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని దిల్లీలో అత్యధికంగా 2,726 కేసులు నమోదయ్యాయి. అక్కడ పాజిటివిటీ రేటు 14.38 శాతంగా ఉండటం గమనార్హం. దీంతో దిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కారు మాస్కులు కచ్చితంగా ధరించాలని గతవారమే ప్రజలను ఆదేశించింది. ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని