రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ అందక చిన్నారి మృతి

వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి అది. రాజస్థాన్‌లోని బీకానేర్‌ జిల్లాలో 6 నెలల పాప నూర్‌ ఫాతిమాకు వచ్చింది. నయం చేయాలంటే ఒక ఇంజెక్షన్‌ అవసరం...

Updated : 16 Jun 2021 11:38 IST

రాజస్థాన్‌: వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి అది. రాజస్థాన్‌లోని బీకానేర్‌ జిల్లాలో 6 నెలల పాప నూర్‌ ఫాతిమాకు వచ్చింది. నయం చేయాలంటే ఒక ఇంజెక్షన్‌ అవసరం. కానీ అది భారత్‌లో దొరకదు. విదేశాల నుంచి తెప్పించాలంటే రూ.16 కోట్లు ఖర్చవుతుంది. అంతటి స్తోమత ఆ పాప తల్లిదండ్రులకు లేదు. దాంతో ఇంజెక్షన్‌ అందక ఆ చిన్నారి మరణించింది. స్పైనల్‌ మస్కులర్‌ అట్రోపీ(ఎస్‌ఎమ్‌ఏ) అనే జన్యువు లోపం వల్ల ఈ నాడీ సంబంధిత వ్యాధి వస్తుంది. మాటను, నడకను, ఆహారం మింగటాన్ని నియంత్రించే మెదడు కణాలను ఈ వ్యాధి క్రమక్రమంగా నశింపజేస్తుంది. కండరాలను బలహీన పరిచి పాలు తాగేందుకు, ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడేలా చేస్తుంది. దీన్ని నయం చేయాలంటే జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్‌ ఇవ్వాలి. అమెరికా నుంచి ఆ ఔషధాన్ని తెప్పించే స్తోమత పాప తల్లిదండ్రులకు లేదు. కొంతమంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు విరాళం ఇచ్చాయి. కానీ అవి సరిపోలేదు. అంతలోనే ఆ పసిబిడ్డ ప్రాణాలు విడిచింది. దేశంలో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులు 800 మంది వరకు ఉంటారని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని