అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది....

Updated : 28 May 2021 21:29 IST

దిల్లీ: దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డీజీసీఏ డైరెక్టరేట్‌ జనరల్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే కార్గో సర్వీసులకు ఇది వర్తించదని తెలిపింది. ఇప్పటికే డీజీసీఏ ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని స్పష్టం చేసింది.

భారత్‌లో కొవిడ్‌ విజృంభిస్తుండటంతో 2020 మార్చి 23 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణ సేవలు నిలిపివేశారు. వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమాన సేవలు మే నుంచి మొదలయ్యాయి. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్‌తో సహా 27 దేశాలతో భారత్.. ఎయిర్ బబుల్ ద్వారా రాకపోకలను కొనసాగిస్తోంది. అయితే దేశంలో కరోనా రెండో దశ కారణంగా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా దేశాలు భారత్‌ నుంచి విమానాలను తాత్కాలికంగా నిషేధించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని