కొవిడ్‌ ఆంక్షలకు నిరసనగా మద్యం విక్రయాలు బంద్‌!

కరోనా వైరస్‌ విజృంభణకు అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల .....

Published : 04 Apr 2021 02:18 IST

ఠానేలో హోటళ్ల యజమానుల ప్రకటన

ముంబయి: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 15 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఠానే జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్‌ యజమానుల సంఘం నిరసన తెలియజేసింది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామని, తాజాగా విధించిన రాత్రి కర్ఫ్యూతో తమ వ్యాపారాలు మరింత దెబ్బతింటున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దీనికి నిరసనగా తమ డిమాండ్లు నెరవేరే దాకా జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్‌ ఫీజును వాయిదాల వారీగా చెల్లించేందుకు అనుమతించడంతో పాటు రాత్రి 8 గంటల నుంచి విధించిన కర్ఫ్యూను ఎత్తివేయాలని కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేదాక ఠానేతో పాటు డొంబ్లివి, కల్యాణ్‌, నవీ ముంబయి తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలను నిలిపివేస్తామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని