Viral Story: మా అమ్మ నన్ను ఎందుకు వదిలించుకుంది?
గత పదకొండేళ్లుగా బీనా తన కన్నతల్లి కోసం వెతుకుతున్నారు. ఆమె కన్నీటి కథ ఆవేదనకు గురిచేస్తోంది.
ముంబయి: తల్లిదండ్రులకు దూరమై.. దత్తతకు వెళ్లిన పిల్లల జీవితాల్లో కన్నీటి తెర కదలాడుతూనే ఉంటుంది. దత్తత వెళ్లిన కుటుంబంలో బాగానే ఉన్నా.. కన్నవారు తమను ఎందుకు వదులుకున్నారో తెలుసుకోవాలని ఆరాటపడతారు. కనీసం ఒక్కసారైనా వారిని కలుసుకోవాలనుకుంటారు. ఇదంతా వింటుంటే మణిరత్నం తీసిన ‘అమృత’ సినిమా కళ్లముందు కదలాడుతోంది కదా..! సరిగ్గా ఇలాంటి కథే బీనా మఖిజానీ ముల్లర్ది. ఆమె కన్నతల్లిని కలుసుకోవాలని పదకొండేళ్లుగా చేయని ప్రయత్నం లేదు.
బీనా ముఖిజానీ ముల్లర్ను 1978లో స్విట్జర్లాండ్కు చెందిన కుటుంబం దత్తత తీసుకుంది. ప్రస్తుతం ఆమెకు (44) సంవత్సరాలు. దక్షిణ ముంబయిలోని ఆశా సదన్ కేంద్రం నుంచి ఆమె దత్తతకు వెళ్లింది. ఆ సమయంలో రికార్డుల్లో బీనా తల్లి పేరు రొబెల్లో అని మాత్రమే ఉంది. ఇప్పుడు తన తల్లిని వెతుక్కోవడానికి బీనాకి ఉన్న ఏకైక క్లూ అది మాత్రమే. ‘రొబెల్లో అనే మహిళ 1978లో ముంబయిలో నాకు జన్మనిచ్చింది. ఆమెది గోవా కావొచ్చు. ఆమె గురించి తెలిసినవారు నన్ను సంప్రదించండి. మీ వివరాల్ని మేం గోప్యంగా ఉంచుతాం. నా జీవితంలో ఇదొక బాధాకర అనుభవం. నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు. నా ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే వెతుకుతున్నాను’ అంటూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు.
‘2011 నుంచి నా తల్లి కోసం వెతుకుతూనే ఉన్నాను. నాటి నుంచి ముంబయి వస్తూనే ఉన్నాను. కానీ, నా ప్రయత్నం కొంచెం కూడా ఫలించలేదు. ఏదో ఒకరోజు నాకు కావాల్సిన సమాధానాలు కనుక్కుంటాను’ అని వెల్లడించారు. తాజాగా మరోసారి తనను దత్తత ఇచ్చిన ఆనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడ ఎలాంటి సమాచారం లభించకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వెతుకులాటలో డైరెక్టర్ ఆఫ్ అడాప్టీ రైట్స్ కౌన్సిల్ అడ్వకేట్ అంజలి పవార్ ఆమెకు సహకరిస్తున్నారు. ‘తమ వద్ద ఎలాంటి పత్రాలు లేవని అనాథాశ్రమం సిబ్బంది వెల్లడించారు. బీనా ఆవేదన వారికి అర్థమవుతోంది. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సాయం చేయలేకపోతున్నారు’ అని పవార్ తెలిపారు. పేరు మాత్రమే తెలిసి ఉండడంతో జాడ తెలుసుకోవడం క్లిష్టంగా మారిందన్నారు.
బీనా తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని మాత్రమే అనుకోవడం లేదు. అసలు తనను ఎందుకు వదిలించుకున్నారో కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బీనాతో పాటు ముంబయికి వచ్చినవారు.. తమ తల్లికి అండగా నిలుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.