Wuhan: 2015లో వుహాన్ నుంచి అమెరికాకు..!
కరోనావైరస్ వ్యాపించిన ఏడాది తర్వాత మెల్లగా ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్’ ప్రయోగాల వివరాలు బయటకు వస్తున్నాయి. వుహాన్ ల్యాబ్లోని ఓ కీలక శాస్త్రవేత్త వైరస్కు సంబంధించిన కీలక భాగాన్ని అమెరికా శాస్త్రవేత్తలకు ఇచ్చి ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు.
స్పైక్ ప్రొటీన్ తెచ్చిన బ్యాట్వుమెన్..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
కరోనావైరస్ వ్యాపించిన ఏడాది తర్వాత మెల్లగా ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్’ ప్రయోగాల వివరాలు బయటకు వస్తున్నాయి. వుహాన్ ల్యాబ్లోని ఓ కీలక శాస్త్రవేత్త వైరస్కు సంబంధించిన కీలక భాగాన్ని అమెరికా శాస్త్రవేత్తలకు ఇచ్చి ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు. అప్పట్లోనే కరోనా వైరస్లాగే ఊపిరితిత్తులను దెబ్బతీసే ఓ వైరస్కు రూపుకల్పన చేశారు. వుహాన్ ల్యాబ్లో చేసిన ఇలాంటి ప్రయోగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారనే వాదనలు బలపడుతున్న సమయంలో ఈ వివరాలు వెల్లడి కావడం విశేషం.
2015లో ఏం జరిగింది?
అమెరికా, చైనాలు సంయుక్తంగా ఈ ప్రమాదకర ప్రయోగాలను నిర్వహించాయి. అమెరికాలో ఆ ప్రయోగాలను ఆపేశాక, నిధులు ఇచ్చి చైనాలో కొనసాగించారనే అనుమానాలు ఉన్నాయి. 2015లో అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా, చైనాలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు కలిసి ఓ సరికొత్త కరోనా వైరస్ను సృష్టించారు. ఇది మానవ కణాలకు తేలిగ్గా అతుక్కుంటుంది. ఊపిరితిత్తుల్లో పునరుత్పత్తి అవుతుంది. ఈ ప్రయోగ వివరాలు ‘నేచర్’ సైన్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ రెండు బృందాలు కొన్నేళ్లపాటు కలిసి ప్రయోగాలు చేశాయి.
ఎలాంటి ప్రయోగాలు?
వైరస్లలో మార్పులు చేయగా వచ్చే ఫలితాలపై ప్రయోగాలు(గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్) నిర్వహించారు. కొన్ని రకాల వైరస్లకు మ్యుటేషన్ అయ్యేటటువంటి పరిస్థితులను కృత్రిమంగా కల్పించి.. అవి కొన్ని తరాలు మ్యుటేట్ అయ్యేలా చేసి, వాటిలో మార్పులపై పరిశోధనలు చేశారు. ఇందులో వైరస్లు వేగంగా వ్యాపించేలా మార్పులు చేయడం వంటివి కూడా ఉన్నాయి. వీటివల్ల భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను అంచనా వేయవచ్చన్నది వారి ఉద్దేశం. 2015లో కరోనాపై చేసిన ప్రయోగమే అమెరికాలో చివరి ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ పరిశోధన. ఆ తర్వాత ఒబామా ప్రభుత్వం దానికి నిధులు ఆపేసింది.
స్పైక్ ప్రొటిన్ను సరఫరా చేసిన షి జియాంగ్ లీ
2015లో అమెరికాలో కరోనావైరస్పై జరిగిన ప్రయోగంలో అవసరమైన కీలకమైన SHC014-CoV స్పైక్ ప్రొటిన్ను షి జియాంగ్ లీ సరఫరా చేశారు. ఆమె అప్పటికే వుహాన్ ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నారు. దీనిని చైనీస్ హార్స్హు గబ్బిలాల్లోని వైరస్ల నుంచి సేకరించారు. దీనిని సార్స్లాంటి వైరస్కు అమర్చారు. దాంతో ఇది ఎలుకలకు సోకే లక్షణాన్ని సంతరించుకొంది. ఈ ఎలుకలకు సార్స్పై పనిచేసే రోగనిరోధక చికిత్సను అందించినా ప్రయోజనం కలుగలేదు. వ్యాక్సిన్లు కూడా పనిచేయలేదు. ఇదే స్పైక్ ప్రొటిన్ మనుషుల్లోని ఏస్2 ఎంజైమ్కు అతుక్కొంటుంది. దీని ద్వారా మానవుల్లోకి కూడా ప్రవేశిస్తుంది.
అమెరికాలో ఈ ప్రయోగాలపై ఆందోళనలు పెరిగిపోయాయి. దీంతో దేశీయంగా ప్రయోగాలను నిలిపివేసి, చైనాకు నిధులను ఇచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా వెబ్సైట్ నుంచి ఇటీవలే ఈ ప్రయోగం వివరాలను తొలగించారు.
నిధులు నిజమే.. ఎలావాడారో తెలియదు!
అమెరికాలోప్రయోగాలపై నిషేధం విధించాక, యుఎస్ ఎన్ఐహెచ్ నుంచి వుహాన్ ల్యాబ్కు ఐదేళ్లలో 6 లక్షల డాలర్లు వెళ్లాయని శ్వేతసౌధం వైద్యసలహాదారు ఆంటోనీ ఫౌచీ అంగీకరించారు. అవి ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్’ ప్రయోగాలకు ఇవ్వలేదని తెలిపారు. కానీ, చైనా ఇలాంటి ప్రయోగాలు చేయలేదని కచ్చితంగా చెప్పలేనని వెల్లడించారు.
వుహాన్పై ఇందుకే సందేహాలు
గతేడాది కరోనావైరస్ వ్యాపించిన సమయంలో ఈ పరిశోధనపై పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆ వైరస్ లక్షణాలు 2015లో తయారు చేసిన వైరస్ లక్షణాలను పోలి ఉండటం, వుహాన్ ఇన్స్టిట్యూట్లో కరోనాపై ప్రయోగాలు జరుగుతుండటం, వుహాన్లోనే వైరస్ తొలి కేసులు రావడంతో అనుమానాలు పెరిగాయి. దీంతో 2020లో అమెరికా 2015 వైరస్ జన్యుక్రమాన్ని, సార్స్కోవ్2 జన్యుక్రమాన్ని బహిర్గతం చేసింది. ఈ రెండింటి మధ్య పొంతనలేదు.
గబ్బలాల నుంచి వైరస్ ఆతిథ్య జీవిలోకి చేరి, అక్కడి నుంచి మనిషిలోకి వచ్చిందని శాస్త్రవేత్తలు ఆధారాలతో చెప్పలేకపోతున్నారు. ఆ ఆతిథ్య జీవి ఏదో ఇప్పటికీ తెలియలేదు. వుహాన్ నగరం సమీపంలో భారీ సంఖ్యలో గబ్బిలాలు లేవు. దీనికి తోడు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు వుహాన్ ల్యాబ్ సిబ్బంది తీవ్రంగా జబ్బుపడిన అంశాన్ని గుర్తించినట్లు వాల్స్ట్రీట్ పేర్కొనడం కుట్రకోణాలకు బలాన్నిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు