ప్రణబ్.. భారత రత్న బంధం..!
‘‘గతేడాది ఆగస్టు 8.. నా తండ్రికి భారత రత్న లభించింది.. అది నాకు చాలా సంతోషకరమైన రోజు.. ఈ ఏడాది ఆగస్టు 10న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు’’.. ..
అవార్డుల పునరుద్ధరణలో కీలక పాత్ర
‘‘గతేడాది ఆగస్టు 8.. నా తండ్రికి భారత రత్న లభించింది.. అది నాకు చాలా సంతోషకరమైన రోజు.. ఈ ఏడాది ఆగస్టు 10న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు’’.. ఇది ప్రణబ్ ముఖర్జీ సైనిక ఆసుపత్రిలో చేరిన రోజు ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ చేసిన ట్వీట్..!. భారత రత్న అవార్డులకు ప్రణబ్కు మధ్య ఓ ఆసక్తికరమైన సంబంధం ఉంది.
ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనతా ప్రభుత్వం తరఫున అధికారం చేపట్టిన మొరార్జీ దేశాయ్ పౌర పురస్కారాలు ఆపేశారు. అప్పటికే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తనకు తానే భారత రత్న ప్రకటించుకొని విమర్శల పాలయ్యారు. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ భారత్ రత్న అవార్డులను తిరిగి ప్రారంభించాలని భావించారు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో ప్రణబ్ ముఖర్జీ ఒకరు. ఆయన అప్పట్లో రాజ్యసభలో ఉన్నారు. ఒక రోజు ఇందిర రాజ్యసభలో ప్రణబ్ పక్కన కూర్చొన్నారు. పౌరపురస్కారాలను పునఃప్రారంభించాలని.. భారత రత్నకు ఒకరిని ఎంపిక చేయాలని కోరారు.
వివాదరహిత వ్యక్తులకు ఇవ్వడం ద్వారా దీనిని పునఃప్రారంభించాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష విమర్శలకు అస్సలు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అయితే అవార్డుకు తగిన వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నరావడంతో.. ప్రణబ్ ఆలోచించి మదర్థెరిస్సా పేరు సూచించారు. ఆ పేరు విని ఇందిరాగాంధీ చాలా సంతోషించారు. ఆమె జాతీయతపై ఇందిరాకు సందేహం రావడంతో.. ‘మదర్’ భారత పౌరసత్వం తీసుకొన్న విషయాన్ని ప్రణబ్ మరోసారి రూఢీ చేసుకొన్నారు. 1980 సంవత్సరానికి భారత రత్నగా మదర్ పేరును ప్రకటించారు. దీంతో ఎవరూ ఇందిరా గాంధీని విమర్శించే అవకాశం రాలేదు.
రాజకీయ చాణక్యం..
భారత్ రత్న అవార్డు ఒక్కటే ప్రధాని సలహాతో రాష్ట్రపతి ప్రకటిస్తారు. పద్మా అవార్డులను హోంశాఖ క్లియరెన్స్తో ప్రధాని , మంత్రివర్గం నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తి రాష్ట్రపతి భవన్లో ఉంటే కొంత రాజకీయం నడుస్తుంది. చట్టంపై పట్టున్న ప్రణబ్ ఇటువంటి ఘర్షణలను లౌక్యంగా నివారించారు.
ప్రణబ్ ముఖర్జీకి సంక్షోభ నివారకుడిగా కాంగ్రెస్లో పేరుంది. ఇటువంటి పేరు రావాలంటే రాజకీయాల్లో ఆ నేత కాకలుతీరినవారై ఉండాలి. రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ భవిష్యత్తును అంచనా వేసి కాంగ్రెస్ 2012లో ప్రణబ్ను రాష్ట్రపతిని చేసింది. 2014 భాజపా అధికారంలోకి వచ్చాక మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారత రత్నా ఇవ్వాలనే ప్రతిపాదనలతో ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రణబ్ను కలిశారు. మోదీ ప్రతిపాదనకు ఆయన అంగీకరించారు. కానీ, ఓ సలహా ఇచ్చారు. ఇప్పటికే మరణించిన ఓ గొప్పనేతకు కూడా ఇవ్వాలని సూచించారు. అంతేకాదు మదన్ మోహన్ మాలవీయ పేరును ఆయన మోదీ ఎదుట పెట్టారు. స్వాతంత్ర్య సేనాని, విద్యావేత్త, బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడు, హిందూ మహాసభకు చెందిన వ్యక్తి అయిన ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించారు. మోదీ దీనికి అంగీకరించారు. 2015 సంవత్సరానికి అటల్, మాలవీయాలకు భారత రత్న ప్రకటించారు. ప్రణబ్ రాష్ట్రపతి భవన్లో ఉన్నంతకాలం మంత్రి వర్గంతో ఎటువంటి వివాదాలకు తావివ్వలేదు.
కుమార్తెకు కూడా తెలియదు..
2019 జనవరి 25న సాయంత్రం ప్రధాని మోదీ నుంచి మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు ఫోన్ వచ్చింది. భారత రత్న అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నాం.. మీ అంగీకారం కోసం ఫోన్ చేశాను అని మోదీ తెలిపారు. అప్పటికే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు భారత్కు రావడంతో మోదీ వ్యక్తిగతంగా ప్రణబ్ వద్దకు రాలేకపోయారు. మోదీ ప్రతిపాదనకు ప్రణబ్ అంగీకరించారు. వెంటనే రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ప్రణబ్తోపాటు ఉంటున్న ఆయన కుమార్తె శర్మిష్ఠకు అప్పటి వరకూ ఈ విషయం తెలియదు. ‘నీకు భారత రత్న వచ్చినా.. ఏమి జరగనట్లే ఉన్నావు. కనీసం నాకు చెప్పలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘ఎవరు ఎంత ప్రయత్నించినా.. ప్రణబ్ నోటి నుంచి రహస్యాలను రాబట్ట లేరు.. ఆయన పైప్ వదిలే పొగ మాత్రమే బయటకు వస్తుంది’’ అని ఇందిరాగాంధీ వ్యాఖ్యానించినట్లు ప్రముఖ జర్నలిస్టు జయంతి ఘోషల్ తెలిపారు. ఆయన ఇందిరా గాంధీకి ఎంత విశ్వాసపాత్రుడో ఈ ఘటన తెలియజేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్