West Bengal: బెంగాల్లో ఎన్నికల తర్వాత హింసపై సీబీఐ దర్యాప్తు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సీబీఐ, సిట్ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది
ఆదేశించిన కల్కత్తా హైకోర్టు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సీబీఐ, సిట్ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో హత్యలు, అత్యాచారం వంటి ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని, ఇతర నేరాలపై దర్యాప్తునకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ బృందంలో కోల్కతా పోలీసు కమిషనర్ సౌమెన్ మిత్రా, ఐపీఎస్ అధికారులు సుమన్ బాలా సాహో, రణ్వీర్ కుమార్ సభ్యులుగా ఉంటారని పేర్కొంది.
ఈ రెండు దర్యాప్తులను కోర్టు పర్యవేక్షిస్తోందని ధర్మాసనం తెలిపింది. వచ్చే ఆరు వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది. కేసులకు సంబంధించిన అన్ని రికార్డులను రాష్ట్ర పోలీసులు సీబీఐకి అప్పగించాలని సూచించింది.
ఈ ఏడాది మార్చి - ఏప్రిల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మే 2న ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే, ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, ఆ అల్లర్లలో కొందరు మహిళలపై అకృత్యాలు జరిగాయని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసిన ఎన్హెచ్ఆర్సీ ఆరోపణలపై దర్యాప్తు జరిపి గత నెల 15న కోర్టుకు నివేదిక సమర్పించింది. ఎన్నికల అనంతరం హింస చెలరేగిన మాట వాస్తవమేని, అధికార పార్టీ కార్యకర్తలు.. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులు జరిపారని పేర్కొంది. మహిళలపై అత్యచారాల వంటి నేరాలు కూడా జరిగినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని సిఫార్సు చేసింది. దీంతో నేడు కోర్టు ఈ దర్యాప్తును సీబీఐ అప్పగించాలని ఆదేశించింది.
సుప్రీంకు దీదీ ప్రభుత్వం..
కాగా.. కోర్టు తీర్పుపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, భాజపా మాత్రం కోర్టు తీర్పును స్వాగతించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా