Bengaluru: ఏడేళ్ల బాలికకు ప్రపంచ శాంతి ఫొటో పురస్కారం

కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన బాలికకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. యునెస్కో అందించే అరుదైన గ్లోబల్‌ పీస్‌ ఫొటో అవార్డు ఏడేళ్ల ఆధ్యను వరించింది......

Published : 03 Oct 2021 01:12 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన బాలికకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. యునెస్కో అందించే అరుదైన గ్లోబల్‌ పీస్‌ ఫొటో అవార్డు ఏడేళ్ల ఆధ్యను వరించింది. దీంతో 1000 యూరోలతోపాటు ఆస్ట్రియా పార్లమెంట్‌ను సందర్శించే అరుదైన అవకాశాన్ని ఆ బాలిక దక్కించుకుంది. ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు ఆధ్య కావడం విశేషం.

బెంగళూరు హెబ్బాల్‌ ప్రాంతంలోని విద్యానికేత్‌ పాఠశాలలో ఆధ్య రెండో తరగతి చదువుతోంది. తల్లి రోషిణి సెల్‌ఫోన్‌తోనే ఆధ్య ఫొటోలు తీసేది. ఆధ్య తీసిన పలు ఫోటోలను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసే ఆమె తండ్రి పలు ఫొటోగ్రఫీ పోటీలకు పంపించారు. తన తల్లి రోషిణి ఆమె తల్లి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను ఆధ్య సెల్‌ఫోన్‌లో బంధించింది. దీనికి ‘శాంతి ఒడి’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. కాగా ఈ ఫొటో బాలల విభాగంలో ప్రపంచ శాంతి ఫొటో పురస్కారానికి ఎన్నికైంది. ఆస్ట్రియా ప్రభుత్వంతో కలిసి యునెస్కో ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తోంది. ప్రపంచ శాంతికి దోహదం చేసేలా ఉండే ఫొటోలను కోరుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫొటోగ్రాఫర్ల నుంచి యునెస్కో ప్రతి ఏటా దరఖాస్తులు స్వీకరిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని