Alert: ఎడ్యుటెక్ కంపెనీల పట్ల జాగ్రత్త!
దిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్యుటెక్) సంస్థలు ఆన్లైన్ ద్వారా అందించే శిక్షణ, కంటెంట్ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విద్యాశాఖ హెచ్చరించింది
అవి ఆన్లైన్ ఉచ్చులు కావొచ్చు
విద్యార్థులు, తల్లిదండ్రులకు కేంద్ర విద్యాశాఖ హెచ్చరిక
ఈనాడు, దిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్యుటెక్) సంస్థలు ఆన్లైన్ ద్వారా అందించే శిక్షణ, కంటెంట్ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విద్యాశాఖ హెచ్చరించింది. ఈ విషయంలో స్పందించాల్సిన తీరుపై కొన్ని సూచనలు జారీచేసింది.
1. సబ్స్క్రిప్షన్ రుసుము కింద ఆటోమేటెక్ డెబిట్ ఆప్షన్ ఇవ్వకూడదు. కొన్ని విద్యా సంస్థలు ప్రీమియం బిజినెస్ మోడల్ కింద మొదట తమ సర్వీసులను ఉచితంగా అందిస్తాయి. తర్వాత ఆ సేవలను కొనసాగించడానికి చెల్లింపులు తప్పనిసరి చేస్తాయి. విద్యార్థులు ఆటో డెబిట్ను యాక్టివేట్ చేసినప్పుడు వారికి తెలియకుండానే డబ్బులు ఖాతా నుంచి వెళ్లిపోతాయి.
2. ఏదైనా సంస్థతో ఒప్పందం చేసుకునేముందు... వారు చెప్పిన విధివిధానాలు, షరతులన్నీ జాగ్రత్తగా చదవాలి. లెర్నింగ్ సాఫ్ట్వేర్ను మీరు ఉపయోగించే డివైజ్ ద్వారా ఆమోదించినప్పుడు వ్యక్తిగత డేటాను ట్రాక్ చేసే ప్రమాదముంది.
3. కంటెంట్ లోడ్చేసిన కంప్యూటర్ పరికరాలు, యాప్లు, పెన్డ్రైవ్లను కొనుగోలు చేసినప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ స్టేట్మెంట్ను అడగాలి.
4. ఏదైనా ఎడ్టెక్ కంపెనీని సబ్స్క్రైబ్ చేసేముందు దాని పూర్వాపరాలను పూర్తిగా తనిఖీ చేసుకోవాలి.
5. ఆ సంస్థలు అందించే కంటెంట్నూ పరీక్షించి చూసుకోవాలి. అందులోని విషయాలు సిలబస్కు అనుగుణంగా ఉన్నాయా? విద్యార్థులు పూర్తిగా అర్థం చేసుకోగలరా? అన్నది పరిశీలించాలి.
6. డబ్బు చెల్లించడానికి ముందే ఆన్లైన్ పోర్టళ్లు అందించే కంటెంట్కు సంబంధించిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకోవాలి.
7. పిల్లలు వినియోగించే కంప్యూటర్ పరికరాలపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉండేలా చూసుకోవాలి.
8. చదువుకు సంబంధించిన యాప్లు పిల్లల్లో ఖర్చును ప్రోత్సహించేలా ఉంటాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
9. ఆన్లైన్ ఎడ్యుటెక్ కంపెనీల గురించి అంతర్జాలంలో ఉండే సమీక్షలను, ఇతరుల అభిప్రాయాలను చదవాలి. తల్లిదండ్రులు, విద్యార్థులు వారి అభిప్రాయాలను కూడా ఆన్లైన్లో పొందుపరచాలి. తద్వారా అవి మిగతావారికి ఉపయోగకరంగా ఉంటాయి.
10. స్పామ్ కాల్స్ సాక్ష్యాలనూ; విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తిస్థాయి సమ్మతి తెలపకముందే బలవంతంగా సంతకాలు చేయించుకొనే ఎడ్యుకేషన్ ప్యాకేజీలకు సంబంధించిన ఆధారాలను రికార్డు చేసుకోండి.
ఎవర్నీ సులభంగా నమ్మొద్దు:
1. ఎడ్యుటెక్ కంపెనీలు చేసే ప్రకటనలను సులభంగా నమ్మొద్దు.
2. అవగాహనలేని పత్రాలపై సంతకాలు చేయొద్దు.
3. వీడియోలు, ఫోటోలను షేర్ చేయొద్దు. వీడియో కాల్స్ సమయంలో వీడియోమోడ్లోకి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
4. మీ ఈ-మెయిల్, కాంటాక్ట్ నంబరు, కార్డు వివరాలు, చిరునామాలను ఆన్లైన్లో ఉంచకండి. ఇలాంటి డేటాను మార్కెట్లో అమ్మేస్తారు. తర్వాత స్కాం దాడులు జరుగుతాయి.
5. ధ్రువీకరించుకోని కోర్సులను సబ్స్క్రైబ్ చేయొద్దు.
6. ఎడ్టెక్ సంస్థలు ప్రచారంచేసే సక్సెస్ స్టోరీలను నమ్మొద్దు. ఎక్కువమందిని ఆకర్షించేందుకు ఎరగా వినియోగించే నిమిత్తం వాటిని రూపొందించి ఉండొచ్చు.
7. మార్కెటింగ్ సిబ్బందితో మీ బ్యాంకు ఖాతా, ఓటీపీ వివరాలను పంచుకోవద్దు. అవి సైబర్ మోసాలకు దారితీసే ప్రమాదముంది.
8. తెలియని సోర్స్ నుంచి కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమయ్యే లింకుల్ని, అటాచ్మెంట్లను క్లిక్ చేయవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.