Bhagwant Mann: మొన్న మద్యం..నేడు కాన్వాయ్: మరో వివాదంలో సీఎం..!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను చూపి, విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
దిల్లీ: ‘వీఐపీ సంస్కృతి’ని ప్రస్తావిస్తూ.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ సంస్కృతికి తాము వ్యతిరేకమంటూ ఆయన ఎన్నికల వేళ ఇచ్చిన హామీని పాటించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నాయి.
‘ప్రకాశ్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కాన్వాయ్లో 33 వాహనాలుండేవి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు అదే సంఖ్య కొనసాగింది. చరణ్జిత్ సింగ్ చన్నీకి ఆరు వాహనాలు ఎక్కువ చేరాయి. ఇప్పుడు భగవంత్ సింగ్ మాన్ గురించి ఆర్టీఐ ద్వారా ఓ షాకింగ్ వాస్తవం తెలిసింది. ఆమ్ఆద్మీగా చెప్పుకొనే ఆయన కాన్వాయ్లో వాహనాల సంఖ్య 42’ అని ఆప్ పార్టీకి చెందిన మాన్పై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
‘ఎన్నికల వేళ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పేదానికి, చేస్తున్నవాటికి పొంతన లేదు. ఇంత భారీ కాన్వాయ్ వల్ల ఏ ప్రయోజనం ఒనగూరుతుందో ఆయన పంజాబ్ ప్రజలకు చెప్పాలి. ఆయన ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు?’ అని కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఈ వ్యవహారంపై ఆప్ స్పందించాల్సి ఉంది. ఇటీవల ఆయన వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పీకలదాకా తాగి విమానం ఎక్కడంతో ఆయనను జర్మనీ ఎయిర్పోర్టులో దించేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే