Bhagwant Mann: పంజాబ్‌ సీఎంకు కాబోయే సతీమణి గురించి తెలుసా?

పంజాబ్‌ ముఖ్యమంత్రి, ఆప్‌ నేత భగవంత్ మాన్‌ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు......

Published : 07 Jul 2022 02:03 IST

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి, ఆప్‌ నేత భగవంత్ మాన్‌ రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆరేళ్ల క్రితం తన తొలి భార్యతో విడాకులవ్వడంతో గురువారం చండీగఢ్‌లో ఆయన గుర్‌ప్రీత్‌ కౌర్‌ అనే యువతిని పెళ్లి చేసుకోనున్నారు. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగే వేడుకలో గుర్‌ప్రీత్‌ కౌర్‌, సీఎం మాన్‌ ఒక్కటి కానున్నారని ఆప్‌ పంజాబ్‌ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి మల్విందర్‌సింగ్‌ కాంగ్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భగవంత్‌ మాన్‌కు కాబోయే సతీమణి ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది. 

డాక్టర్‌ గుర్‌ప్రీత్‌ కౌర్‌ కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె వయస్సు ప్రస్తుతం 32 ఏళ్లు. ఆమె తండ్రి ఇంద్రజిత్‌ సింగ్‌ ఓ రైతు కాగా.. తల్లి మాతా రాజ్‌ కౌర్‌ గృహిణి. గుర్‌ప్రీత్‌ ఇద్దరు సోదరిలూ విదేశాల్లో ఉంటున్నారు. కొన్నేళ్లుగా మాన్‌, గుర్‌ప్రీత్‌ కౌర్‌ కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఆమె చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారట. ముల్లానా వైద్య కళాశాలలో విద్యనభ్యసించిన గుర్‌ప్రీత్‌ కౌర్‌.. బంగారు పతకం కూడా సాధించారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె భగవంత్‌ మాన్‌కు ఎంతగానో సహాయం అందించినట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని