టీకా మానవ ప్రయోగాల్లో 23వేల మంది వాలెంటీర్లు
కీలకమైన మూడోదశ మానవ ప్రయోగాల్లో పాల్గొనేందుకు తొలివిడతగా 23 వేల మంది వాలెంటీర్లను నియమించారు.
దేశంలో ఏకైక మానవ ప్రయోగం: భారత్ బయోటెక్
హైదరాబాద్: కొవిడ్ వ్యాప్తి నిరోధానికి భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను దేశీయంగా అభివృద్థి చేసింది. ఇందుకు సంబంధించి కీలకమైన మూడోదశ మానవ ప్రయోగాల్లో పాల్గొనేందుకు తొలివిడతగా 23 వేల మంది వాలెంటీర్లను నమోదు చేసుకొంది. హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లతో కలసి కొవాగ్జిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీకా మూడోదశ ప్రయోగాలు నవంబర్లో ప్రారంభమయ్యాయి.
కొవాగ్జిన్ మూడోదశ ప్రయోగాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో మొత్తం 26 వేల మందిపై నిర్వహించనున్నారు. భారత్లో ఇంతవరకు జరిగిన మనుషులపై టీకా ప్రయోగాల్లో ఇదే అతిపెద్దదని కూడా భారత్ బయోటెక్ తెలిపింది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొంటున్న వాలెంటీర్లకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా కృతజ్ఞతలు తెలియచేశారు. వారి సహకారం దేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా గొప్ప ధైర్యాన్నిస్తుందని ఆమె ప్రశంసించారు. తమ కరోనా టీకా ప్రయోగాల్లో భాగమైన ముఖ్య పరిశోధకులు, వైద్యులు, ఆస్పత్రులు, వైద్యారోగ్య సిబ్బంది తదితరులందరికీ కూడా ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.