Bharat Jodo Yatra: జోడో యాత్రపై కశ్మీర్ ప్రముఖుల మౌనమేల?
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తున్నప్పటికీ టీవీ ఛానెళ్ల నుంచి, స్థానిక ప్రముఖుల నుంచి మద్దతు కరవవుతోందని ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మరోవైపు యాత్ర కశ్మీర్లో ప్రవేశించిన తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చినట్లుందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబూ ముఫ్తీ అన్నారు.
శ్రీనగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు కశ్మీర్లో విశేష స్పందన లభిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP) కీలక నేత ఒమర్ అబ్దుల్లా (Omar abdullah) అన్నారు. అయితే, స్థానిక ఛానెళ్లు, కశ్మీర్ ప్రముఖులు దీనిపై మౌనంగా ఉండటంపై ఆయన పెదవి విరిచారు. ‘‘ జోడో యాత్రపై మాట్లాడాల్సిన వాళ్లు మౌనంగా ఉంటున్నారు. టీవీ ఛానెళ్లు కూడా పెద్దగా కవరేజీ ఇవ్వడం లేదు’’ అని అన్నారు. కశ్మీరీ ప్రజల నుంచి రాహుల్ యాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్న ఆయన.. చిన్నా పెద్దా, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా దేశ ఐక్యత కోసం రోడ్లపై ప్రజలు బారులు తీరుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్టు చేశారు.
కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్లో ప్రవేశించడంతో స్వేచ్ఛా వాయువులు పీల్చినట్లనిపిస్తోందని పీపుల్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. 2019, ఆగస్టు 5న జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావడం ఇదే తొలిసారి అని ఆమె అన్నారు. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కశ్మీర్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా సరిహద్దుకు చేరుకున్న రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన ఆమె.. యాత్రలో భాగస్వాములయ్యారు. రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటూ ఆమె ట్వీట్ చేశారు.
భద్రతా కారణాలతో భారత జోడో యాత్రను రాహుల్ గాంధీ శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం యాత్ర తిరిగి ప్రారంభమైంది. తనకు సరైన రక్షణ కల్పించక పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. జనాన్ని నియంత్రించే పోలీసులు ఎక్కడా కనిపించలేదని, దీంతో తన భద్రతా సిబ్బంది సూచన మేరకు యాత్ర నుంచి వైదొలిగానని తెలిపారు. జమ్ము ప్రాంతంలోని బనిహాల్ నుంచి జవహార్లాల్ సొరంగం గుండా..కాజీగుండ్లోకి ప్రవేశించిన రాహుల్.. 500 మీటర్లు నడిచిన తర్వాత యాత్రనుంచి విరమించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.