Bharat Jodo Yatra: 5 నెలలు.. 4000 కి.మీ.. ముగిసిన రాహుల్ యాత్ర..!
భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగిసింది. సుమారు 5 నెలలపాటు 4వేల కి.మీ మేర ఈ యాత్ర కొనసాగింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర కశ్మీర్లో ముగిసింది. ఈ తరుణంలో జనవరి 30న కశ్మీర్లో ముగింపు సభ ఏర్పాటు చేసింది.
దిల్లీ: భాజపా విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగిసింది. ‘మిలే కదం.. జుడే వతన్ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. 12 రాష్ట్రాల్లో సాగింది. కశ్మీర్లోని లాల్చౌక్లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది. 145 రోజుల (దాదాపు 5 నెలలు)పాటు సాగిన ఈ సుదీర్ఘ యాత్ర దాదాపు 3970 కి.మీ మేర సాగింది.
సుమారు ఐదు నెలలపాటు కొనసాగిన ఈ యాత్ర మధ్యలో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి. రాహుల్ ధరించిన టీ షర్టు మొదలు వీర్ సావర్కర్, కొవిడ్ నిబంధనలు వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ రూ.41వేల విలువచేసే టీ షర్టుపై యాత్ర ఆరంభంలోనే భాజపా తీవ్ర విమర్శలు చేసింది. వీటితోపాటు పంజాబ్లో పాదయాత్రలో పాల్గొన్న ఓ కాంగ్రెస్ ఎంపీ చనిపోగా.. మహారాష్ట్రలో యాత్ర కొనసాగుతున్న సమయంలో మరో కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం వంటి విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
ప్రముఖుల మద్దతు..
రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఆయనకు సంఘీభావం తెలుపుతూ యాత్రలో భాగమయ్యారు. దివంగత జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ కుటుంబ సభ్యులు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్లో బాలీవుడ్ నటి పూజా భట్ రాహుల్ వెంట నడిచారు. మహారాష్ట్రలో మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, నటుడు కమల్ హాసన్, బాక్సర్ విజేందర్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి, పరమ్ వీరచక్ర గ్రహీత కెప్టెన్ బానా సింగ్, నటి ఊర్మిళ మతోండ్కర్, స్వరా భాస్కర్, రియా సేన్, ఆదిత్యా ఠాక్రే, సుప్రియా సూలే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, పంజాబ్లో హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా కుటుంబ సభ్యులతో పాటు ఎంతో మంది ప్రముఖులు రాహుల్ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఆయన వెంట నడిచారు.
30న ముగింపు సభ..
సుదీర్ఘకాలం పాటు సాగిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. యాత్ర ముగింపు సందర్భంగా కశ్మీర్లో సోమవారం (జనవరి 30) బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు 12 విపక్ష పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 21 పార్టీలకు ఆహ్వానం పంపినప్పటికీ.. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పార్టీలు రావడం లేదని తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన