మళ్లీ అనారోగ్యం: ఎంపీ ప్రగ్యా ముంబయికి తరలింపు!

భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో చికిత్సనిమిత్తం ఆమెను విమానంలో ముంబయికి......

Published : 06 Mar 2021 18:42 IST

ముంబయి: భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి అనారోగ్యం బారినపడ్డారు. దీంతో చికిత్సనిమిత్తం ఆమెను విమానంలో ముంబయికి తరలించారు. శ్వాససంబంధమైన సమస్యలు తలెత్తడంతో ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆమె కార్యాలయం వెల్లడించింది. నెల రోజుల వ్యవధిలోనే ఆమె అనారోగ్యానికి గురికావడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 19న అనారోగ్యంతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో కూడా ఆమె కొవిడ్‌ లక్షణాలతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. 

2008 మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో అరెస్టయిన ప్రగ్యా ఠాకూర్‌ 2017లో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమెకు బెయిల్‌ మంజూరైంది. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి బరిలో నిలిచిన ప్రగ్యా.. కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె వార్తల్లో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని