Bhutan: కరోనా కట్టడి.. రాజు చర్యలకు ప్రపంచం ఫిదా!
వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, కట్టడి చర్యలను పరిశీలించేందుకు ఏకంగా భూటాన్ రాజు రంగంలోకి దిగారు.
పర్వత ప్రాంతాలకు కాలినడకన ప్రయాణం
మహమ్మారిపై అవగాహన, కట్టడి చర్యలపై సమీక్ష
థింపూ: కరోనా వైరస్ ధాటికి యావత్ ప్రపంచం వణికిపోతున్న విషయం తెలిసిందే. వైరస్ను కట్టడి చేయలేక చిన్నాపెద్ద తేడా లేకుండా పలుదేశాల ఆరోగ్య వ్యవస్థలు చేతులెత్తేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మహమ్మారి పోరులో భూటాన్ ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, కట్టడి చర్యలను పరిశీలించేందుకు స్వయంగా భూటాన్ రాజు రంగంలోకి దిగారు. సంప్రదాయ దుస్తులను ధరించి ఓ సాధారణ వ్యక్తిలా బయలుదేరిన రాజు.. అవసరమైన చోట కాలినడకన కొండకోనల్లో ప్రయాణం సాగిస్తున్నారు. ఇలా అక్కడి ప్రభుత్వంతో పాటు ఏకంగా రాజే రంగంలోకి దిగి కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అక్కడ వైరస్ వ్యాప్తిని నియంత్రించడమే కాకుండా మరణాలు పెరగకుండా అరికట్టగలిగారు. ఇప్పటివరకు అక్కడ 2వేల పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కేవలం ఒకే ఒక్క కొవిడ్ మరణం సంభవించింది.
కొండకోనల్లో పర్యటన..
కరోనాకు పుట్టినిల్లైన చైనా ఓ వైపు, కొవిడ్ విజృంభణతో వణికిపోతోన్న భారత్ మరోవైపు ఉండడంతో వైరస్ వ్యాప్తిపై భూటాన్ ఆందోళన చెందింది. అయినప్పటికీ సరిహద్దులపై ఆంక్షలు విధించి వైరస్ కట్టడికి నడుం బిగించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించేందుకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్ నేరుగా రంగంలోకి దిగారు. మారుమూల ప్రాంతాలకు గుర్రాలు, కార్లలో వెళ్లారు. పర్వత ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ముందుకు సాగారు. ఇలా కరోనా వైరస్పై నేరుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వైరస్ వ్యాప్తి నియంత్రణకోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఆరోగ్య, కొవిడ్ టాస్క్ఫోర్స్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దాదాపు 4,343మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సేవలందిస్తోన్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపేందుకు ఏకంగా ఐదురోజుల పాటు నడక మార్గాన్ని కొనసాగించారు.
రాజు విన్నపంతో..
అడవిలో కార్చిచ్చు మాదిరిగా వైరస్ వ్యాపిస్తే దేశం మొత్తం సర్వనాశనం అవుతుందని రాజు ఆందోళన చెందినట్లు అంతఃపుర వర్గాలు వెల్లడించాయి. అందుకే కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి నేరుగా రాజు వాంగ్చుక్ మారుమూల ప్రాంతాలను పర్యటించారని ప్యాలెస్ అధికారులు వెల్లడించారు. పర్వతాలు, అటవీ ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని రాజు ప్రజలను నేరుగా కోరారు. దాంతో ఈ విషయాన్ని ప్రజలు కూడా సీరియస్గా తీసుకున్నారని భూటాన్ ప్రధానమంత్రి తొటై షెరింగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా రాజు పర్యటనతో కొవిడ్పై పోరులో తాము ఒంటరిగా లేమనే భావన ప్రజల్లో కలిగిందన్నారు.
ఒకే ఒక్క మరణం..
కొవిడ్పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటన మొదలుపెట్టిన రాజు వాంగ్చుక్.. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించారు. ప్రతి పర్యటన అనంతరం రాజధాని థింపూ చేరుకున్నాక క్వారంటైన్లోకి వెళ్లిపోయేవారు. ఇలా కొవిడ్ నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు అత్యంత ప్రమాదకరమైన సరిహద్దు ప్రాంతాలను కూడా పర్యటించినట్లు భూటాన్లోని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధి రుయి పాలౌడే జీసస్ పేర్కొన్నారు. ఇలా గత 14 నెలలుగా కొవిడ్ కట్టడికి భూటాన్ రాజు తీసుకున్న చర్యలు వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో స్పష్టంగా కనిపించాయి. దాదాపు 7లక్షల జనాభా కలిగిన భూటాన్లో ఇప్పటివరకు 2వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా, కేవలం ఒకే ఒక్క కరోనా మరణం చోటుచేసుకుంది.
90 శాతం టీకా పంపిణీ పూర్తి
చిన్న దేశమైనప్పటికీ కొవిడ్ నియంత్రణ చర్యలను భూటాన్ పకడ్బందీగా అమలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతోన్న నేపథ్యంలో సరిహద్దులను మూసివేసింది. టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే అక్కడ అర్హత కలిగిన 90శాతం మంది లబ్ధిదారులకు ఆస్ట్రాజెనికా టీకా తొలి డోసును అందించింది. అయితే రెండో డోసు ఇచ్చే సమయంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో మిశ్రమ వ్యాక్సిన్ విధానంలో వేరే టీకా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలాఉంటే, ప్రశాంతతకు మారుపేరైన భూటాన్లో 2008 వరకు రాచరిక పాలన కొనసాగింది. అనంతరం రాజు తనకున్న అసాధారణ అధికారాలను వదులుకోవడంతో అప్పటినుంచి భూటాన్లో ప్రజాస్వామ్య పాలన మొదలయ్యింది. అయినప్పటికీ రాజవంశం మీదున్న గౌరవంతో సామాజిక-రాజకీయ అంశాల్లో రాజు కీలక భూమిక పోషించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’