24 గంటల్లో సున్నా నుంచి 57 లక్షలకు!
బుధవారం నాటికి సున్నా ఫాలోవర్లు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 57 లక్షలకు చేరుకోవటం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జో బైడెన్కు ఫాలోయింగ్ మామూలుగా లేదు. ట్విటర్లో సున్నా ఫాలోవర్లతో మొదలైన ఆయన అధికారిక ఖాతా.. 24 గంటలు గడవకుండానే ఐదు మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం నాటికి సున్నా ఫాలోవర్లు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 57 లక్షలకు చేరుకోవటం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడి అధికారిక ఖాతా @POTUS ను ట్విటర్ యాజమాన్యం బైడెన్కు బదలాయించిన సంగతి తెలిసిందే. ఐతే, గతంలో ఎన్నడూ లేని విధంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి లక్షలాది ఫాలోవర్లను తొలగించింది. బైడెన్కు పోటస్ ఖాతాను అప్పగించే సమయానికి ఫాలోవర్ల సంఖ్యను సున్నా చేసింది. దీనిపై బైడెన్ బృందం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పోటస్ను అనుసరించిన వాళ్లు కావాలనుకుంటే మళ్లీ అదే ఖాతాను ఫాలో అవ్వొచ్చని ట్విటర్ స్పష్టం చేసింది.
అయితే సున్నా ఫాలోవర్లతో మొదలైనప్పటికీ.. బైడెన్కు ట్విటర్లో తొలిరోజే విశేషాదరణ లభించింది. ప్రస్తుతం ఆయనను పోటస్ ఖాతా నుంచి అనుసరించేవారి సంఖ్య 57లక్షలకు పైనే ఉంది. అయితే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధికారిక ఖాతా @VPని ఏకంగా 74లక్షల మందికి పైనే అనుసరిస్తుండటం విశేషం.
ఇదీ చదవండి..
కరోనాపై యుద్ధం.. ఇదే బైడెన్ అస్త్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.