Circle Around Sun: సూర్యుడి చుట్టూ వృత్తం.. ఎలాగంటే!
ఆకాశంలో అత్యంత అరుదుగా కనిపించే వృత్తాకార వలయాలు, ఇంద్రధనస్సు వంటి దృగ్విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
కనువిందు చేస్తున్న 22 డిగ్రీ వృత్తాకార వలయాలు
దిల్లీ: అంతరిక్షంలో ఆశ్చర్యాలకు గురిచేసే అద్భుతాలు నిత్యం ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి. ఇలా ఆకాశంలో అత్యంత అరుదుగా కనిపించే వృత్తాకార వలయాలు, ఇంద్రధనస్సు వంటి దృగ్విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా తెలంగాణలోనూ పలుచోట్ల సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు మాదిరి వలయాలను ప్రజలు ఆసక్తిగా గమనించారు. అయితే, ఇటువంటి వలయాలు సాధారణమైనవేనని.. వీటిని 22డిగ్రీ వృత్తాకార వలయాలుగా పేర్కొంటారని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఏమిటీ వలయం..?
సూర్యుడు చుట్టూ ఇంద్రధనస్సు మాదిరి వలయం కనిపించడం సాధరణ ప్రక్రియే. వాతావరణంలో ఉండే నీటిబిందువుల నుంచి కాంతి ప్రయాణించినప్పుడు కాంతి విక్షేపణం (Scattering) చెందడం వల్ల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇదే మాదిరిగా ఒక్కోసారి సూర్యుడి చుట్టూ వృత్తాకార వలయాలు ఏర్పడుతాయి. భూమిపై ఏదైనా ప్రదేశం నుంచి సూర్యున్ని వీక్షిస్తున్నప్పుడు అక్కడ ఏర్పడిన వృత్తం వ్యాసార్థం 22 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే ఈ వృత్తం ఏర్పడే ప్రక్రియను ‘22 డిగ్రీ వృత్తం’ అని పిలుస్తుంటారు. సముద్రమట్టానికి 20వేల అడుగుల ఎత్తులోనూ లక్షల కొద్ది అతి చిన్న మంచు స్ఫటికాల రూపంలో ఉండే తేలికగా మేఘాలు (సిర్రస్ క్లౌడ్స్) ఉంటాయనడానికి సంకేతంగా ఇలాంటి వృత్తాలు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
షట్కోణ ఆకారంలో ఉండే నీటి బిందువుల ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు అది వక్రీభవనం (కాంతి విభజన) తో పాటు పరావర్తనం చెంది మెరవడం వల్ల ఇలాంటి వృత్తాలు కనిపిస్తాయి. ఇంద్రధనస్సు ఏర్పడే మాదిరిగానే ఇవి సూర్యుడి చుట్టూ లేదా చంద్రుడి చుట్టూ ఏర్పడుతుంటాయి. స్థానిక వాతావరణ మార్పుల దృష్ట్యా ఒక్కో ప్రదేశంలో ఒక్కో సమయంలో ఇవి కనిపిస్తుంటాయి. సాధారణ సమయంలో మంచు పడుతున్న సమయంలోనూ ఇలాంటి వృత్తాలను మనం గమనిస్తూనే ఉంటాం’ అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ పేర్కొన్నారు. చంద్రుడి చుట్టూ కనిపించే ఇలా వృత్తాలను ‘మూన్ రింగ్’గా వ్యవహరిస్తారు. అయితే, ఇంద్రధనస్సులతో పోలిస్తే ఇవి ఎక్కువ రోజులు ఆకాశంలో కనిపిస్తూ కళ్లను కనువిందు చేస్తుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది..?
ప్రకృతిలోని సూర్యకాంతి అనేక లక్షల నీటిబిందువులతో విక్షేపణం (scattering) చెందడం వల్ల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. సూర్యుడి కాంతి నీటిబిందువులపై పడినప్పుడు ఈ తెల్లని కాంతి విక్షేపణం (scattering) చెంది ఎరుపురంగు తక్కువ విచలనాన్ని (Deviation), ఊదారంగు ఎక్కువ విచలనాన్ని (Deviation) పొందుతాయి. నీటి బిందువు రెండోవైపునకు చేరిన వివిధ రంగుల కాంతులు సంపూర్ణాంతర పరావర్తనం (Total Internal Reflection) వల్ల నీటి బిందువులోనే వెనుకకు పరావర్తనం చెందుతాయి. ఇలా నీటిబిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్లే కిరణాల మధ్యకోణం 0 నుంచి 42 డిగ్రీల మధ్య ఎంతయినా ఉండవచ్చు. ఈ కిరణాల మధ్యకోణం 40 నుంచి 42డిగ్రీలు మధ్య ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అయితే, ఇంద్రధనస్సు భూమిపై నుంచి చూసినప్పుడు అర్థవృత్తాకారంలో కనిపించినప్పటికీ.. విమానం నుంచి చూసినప్పుడు మాత్రం పూర్తి వృత్తంలా కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.