Nitin Gadkari: గాలికి బ్రిడ్జి కూలిందన్న ఐఏఎస్ అధికారి.. కంగుతిన్న గడ్కరీ
బిహార్లో ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కొంతభాగం కూలిపోయింది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరణ కోరారు. అయితే ఆ వంతెన గాలికి కూలిందని ఐఏఎస్ అధికారి ఒకరు
దిల్లీ: బిహార్లో ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కొంతభాగం కూలిపోయింది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరణ కోరారు. అయితే ఆ వంతెన గాలికి కూలిందని ఐఏఎస్ అధికారి ఒకరు సమాధానమిచ్చారట. దీంతో కంగుతినడం కేంద్రమంత్రి వంతైంది. ఈ విషయాన్ని స్వయంగా గడ్కరీనే చెప్పడం గమనార్హం.
దిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గడ్కరీ ఈ సంఘటన గురించి చెప్పారు. ‘‘ఏప్రిల్ 29న బిహార్లో ఓ వంతెన కూలింది. దీనికి కారణమేంటని నేను నా సెక్రటరీని అడిగా. బలమైన గాలులు వీయడం వల్లే బ్రిడ్జి కూలిందని ఆయన(సెక్రటరీ) తేలిగ్గా చెప్పేశారు. ఓ ఐఏఎస్ అధికారి ఇలాంటి వివరణ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. అయినా గాలుల వల్ల వంతెన ఎలా కూలుతుందో నాకర్థం కాలేదు. నిర్మాణంలో ఏమైనా లోపం ఉందేమో’’ అని గడ్కరీ చెప్పుకొచ్చారు. నాణ్యాతపరమైన లోపాలు లేకుండా తక్కువ ఖర్చులో వంతెనల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
బిహార్లోని సుల్తాన్గంజ్, అగౌనీ ఘాట్ మధ్య రూ.1710 కోట్లతో 2014లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభించారు. దీని పొడవు 3.116కిలోమీటర్లు. 2019 నాటికే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇంకా పూర్తికాలేదు. ఏప్రిల్ 29న ఈ వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. దీనిపై సీఎం నీతీశ్ కుమార్ దర్యాప్తునకు ఆదేశించినట్లు సుల్తాన్గంజ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్ అంతకుముందు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత తక్కువ ఉన్న మెటీరియల్ వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!