నీతీశ్‌ ప్రచారంలో.. ‘లాలూ జిందాబాద్‌’..!

బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో సీఎం నీతీశ్ ‌కుమార్‌ బుధవారం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పార్సా నియోజకవర్గ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతుండగా కొందరు ఆర్జేడీకి అనుకూల నినాదాలు చేయడమే ఇందుకు......

Published : 22 Oct 2020 01:22 IST

దిల్లీ: బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో సీఎం నీతీశ్ ‌కుమార్‌ బుధవారం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పార్సా నియోజకవర్గ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతుండగా కొందరు ఆర్జేడీకి అనుకూల నినాదాలు చేయడమే ఇందుకు కారణం. నీతీశ్‌ మాట్లాడే సమయంలో కొందరు వ్యక్తులు ‘లాలూ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేయగా ఆయన స్పందిస్తూ.. ‘అర్థం లేని మాటలు మాట్లాడే వారు ఎవరో కాస్త చేయి పైకి లేపాలి. సభలో గందరగోళం సృష్టించొద్దు. నాకు ఓటు వేయాలనే ఉద్దేశం మీకు ఉంటే వేయండి. లేకపోతే లేదు. అంతేగానీ ఇక్కడ గందరగోళం సృష్టించొద్దు’ అంటూ నీతీశ్‌ ఆగ్రహానికి లోనయ్యారు.

తన ప్రసంగానికి అంతరాయం కలిగించేలా నినాదాలు చేస్తున్న వారి ప్రవర్తన ఆమోదయోగ్యమైనదేనా అని నీతీశ్‌ సభలో ఉన్నవారిని ప్రశ్నించగా.. ఆయన మద్దతుదారులు ‘లేదు’ అని గట్టిగా బదులిచ్చారు. ఆ సమయంలో వేదికపై నీతీశ్‌తో పాటు చంద్రిక రాయ్‌ ఉన్నారు. చంద్రిక రాయ్‌ గతంలో ఆర్జేడీ నాయకుడు. ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌కు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసిన అనంతరం తలెత్తిన వివాదాల కారణంగా ఆయన ఆ పార్టీని వీడారు. ఇటీవల సీఎం నీతీశ్‌ సమక్షంలో జేడీయూలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని