పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
‘‘కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరకొరా విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేకపోయాను’’ అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు
పట్నా: ‘‘కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరకొరా విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేకపోయాను’’ అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజీ ప్రొఫెసర్. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా జీతం తీసుకొనేందుకు తన మనస్సాక్షి అంగీకరించలేదంటూ దాదాపు రూ.24లక్షలను వెనక్కి ఇచ్చేశారు. నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచిన ఆయన పేరు లలన్ కుమార్. పనిచేసేది బిహార్ ముజఫర్పూర్లోని ఓ ప్రభుత్వ కళాశాలలో.
బిహార్కు చెందిన 33 ఏళ్ల లలన్ కుమార్ దిల్లీలోని జవహార్లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్, దిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ, ఎంఫిల్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ముజఫర్పూర్లోని నితిశేశ్వర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. ఇది బీఆర్ అంబేడ్కర్ బిహార్ యూనివర్శిటీ (బీఆర్ఏబీయూ) అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబరులో లలన్ ఉద్యోగంలో చేరగా.. ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్డౌన్ రావడంతో కాలేజీ మూతబడింది. ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లలన్ తన రెండేళ్ల తొమ్మిది నెలల వేతనాన్ని బీఆర్ఏబీయూ యూనివర్శిటీ రిజిస్ట్రార్కు మంగళవారం తిరిగిచ్చేశారు.
ఈ సందర్భంగా లలన్ మాట్లాడుతూ.. ‘‘ఈ కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్కరోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయాను. పాఠాలు చెప్పనప్పుడు జీతం తీసుకొనేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. అందుకే వేతనాన్ని తిరిగిచ్చేశా’’ అని తెలిపారు. ఈ 33 నెలలకు రూ.23,82,228 వేతనాన్ని తీసుకోగా.. ఆ మొత్తాన్ని లలన్ చెక్కు రూపంలో తిరిగిచ్చారు. అతడి చర్యను బీఆర్ఏబీయూ రిజిస్ట్రార్ అభినందించారు.
అయితే లలన్పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన ఇటీవల పీజీ డిపార్ట్మెంట్లో బదిలీకి అభ్యర్థన పెట్టుకున్నారని, దీనిలో భాగంగానే యూనివర్శిటీపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యకు పాల్పడ్డాడని నితిశేశ్వర్ కాలేజీ ప్రిన్సిపల్ ఆరోపించారు. అయితే, లలన్ క్లాసులకు పిల్లలు హాజరుకాకపోవడంతో బీఆర్ఏబీయూ యూనివర్శిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్ను ఆదేశించినట్లు సమాచారం.
నితిశేశ్వర్ కాలేజీలో దాదాపు 3వేల మంది విద్యార్థులు చదువుతుండగా.. ఇందులో 1100 మంది అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులున్నారు. లలన్ ఒక్కడే ఈ కాలేజీలో రెగ్యులర్ హిందీ టీచర్. అతడితో పాటు మరో గెస్ట్ లెక్చరర్ అప్పుడప్పుడు కళాశాలకు వస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
-
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
-
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
-
Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు